English | Telugu

చిన్న సినిమా పెద్ద హిట్ కొట్టేలా ఉంది!

ఇటీవల ప్రమోషన్స్ తో అందరి దృష్టిని ఆకర్షించిన చిన్న సినిమా అంటే 'మేం ఫేమస్' అని చెప్పొచ్చు. పలువురు సినీ సెలబ్రిటీలతో ఈ సినిమాని ప్రమోట్ చేస్తున్న తీరు ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా యూత్ ఈ సినిమా పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. ఇక తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది.

'మేం ఫేమస్' ట్రైలర్ తాజాగా నేచురల్ స్టార్ నాని చేతుల మీదుగా విడుదలైంది. ఎంటర్టైన్మెంట్ ప్రధానంగా సాగిన ఈ ట్రైలర్ మెప్పిస్తోంది. ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ తో పాటు ఎమోషన్స్ కూడా ఉన్నాయని ట్రైలర్ బట్టి అర్థమవుతోంది. ఇది పక్కా పల్లెటూరు నేపథ్యంలో సాగే కథ. పనిపాట లేకుండా తిరిగే హీరో మరియు అతని ఫ్రెండ్స్ ని ఊళ్ళోవాళ్లంతా చులకనగా చూస్తుంటారు. పిల్లల తీరు వల్ల వారి తల్లిదండ్రులు కూడా ఊళ్ళో తలదించుకునే పరిస్థితి వస్తుంది. ఈ అవమానాలను, బాధలను తట్టుకొని హీరో మరియు అతని ఫ్రెండ్స్ ఎలా ఫేమస్ అయ్యారు? అసలు ఫేమస్ అవ్వడానికి వాళ్ళు ఏం చేశారు? అనే ఆసక్తిని కలిగిస్తూ ట్రైలర్ ను రూపొందించారు. ట్రైలర్ లో పలు సన్నివేశాలు, సంభాషణలు యూత్ కి కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. చూస్తుంటే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సర్ ప్రైజ్ హిట్ కొట్టేలా ఉంది.

సుమంత్ ప్రభాస్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'మేం ఫేమస్'. ఛాయ్ బిస్కెట్ ఫిలిమ్స్, లహరి ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా మే 26 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ బ్యానర్స్ లో రూపొందిన 'రైటర్‌ పద్మభూషణ్‌' ఈ ఏడాది చిన్న సినిమాగా విడుదలై మంచి విజయాన్ని సాధించింది. ఆ మ్యాజిక్ ని 'మేం ఫేమస్' కూడా రిపీట్ చేస్తుందేమో చూడాలి.

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.