English | Telugu

జనవరిలో 'వీరయ్య'ది పైచేయి.. ఫిబ్రవరిలో గెలుపు ఎవరిది!

జనవరి నెల ముగిసింది. సంక్రాంతి కానుకగా విడుదలైన 'వీరసింహారెడ్డి' హిట్ టాక్ తెచ్చుకుంది. 'వాల్తేరు వీరయ్య' సూపర్ హిట్ టాక్ తో నడిచింది. 'వారసుడు' యావరేజ్ టాక్ తో ఓకే అనిపించింది. 'కళ్యాణం కమనీయం' చిత్రం ఫ్లాప్ అయ్యింది. 'హంట్' చిత్రం ది కూడా అదే పరిస్థితి. ఇక హిందీ చిత్రం 'పఠాన్' తెలుగులో కూడా మంచి కలెక్షన్లు వసూలు చేసింది.

ఇక ఫిబ్రవరి సినిమాల సందడి మొదలైంది. నేడు(ఫిబ్రవరి 3న) 'రైటర్ పద్మభూషణ్' సినిమాతో సుహాస్, 'మైఖేల్' మూవీతో సందీప్ కిషన్ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అందులో 'రైటర్ పద్మభూషణ్' పాజిటివ్ టాక్ తెచ్చుకోగా, 'మైఖేల్' యావరేజ్ టాక్ తో సరిపెట్టుకుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన 'బుట్టబొమ్మ' ఫిబ్రవరి 4న విడుదలవుతోంది. నందమూరి కళ్యాణ్ రామ్ 'అమిగోస్' ఫిబ్రవరి 10న విడుదల కాబోతోంది. మైత్రి మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. అందునా 'బింబిసార' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత కళ్యాణ్ రామ్ నటించిన చిత్రం కావడం.. ఇందులో కళ్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేయడం మొదలైనవి ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. కిరణ్ అబ్బవరం గీత ఆర్ట్స్ లో చేసిన 'విన‌రో భాగ్య‌ము విష్ణు కథ' ఫిబ్రవరి 17న విడుదల కాబోతోంది. ధనుష్ తెలుగులో నటిస్తున్న 'సార్' చిత్రం ఫిబ్రవరి 17న విడుదలవుతోంది. ఈ సినిమాపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. సమంత నటించిన శాకుంతలం చిత్రం కూడా ఫిబ్ర‌వ‌రి 17న విడుదల కానుంది. మైథ‌లాజిక‌ల్ కాన్సెప్ట్ తో భారీ బడ్జెట్ మూవీ గా త్రీడీ వెర్ష‌న్ లో ఈ చిత్రం ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతోంది. గుణశేఖర్ నుంచి చాలా కాలం తర్వాత వస్తున్న సినిమా ఇది. పాన్ ఇండియా రేంజ్ లో ఈ చిత్రానికి మంచి అంచనాలు ఉన్నాయి. అందునా ఈ చిత్రానికి దిల్ రాజు భాగస్వామి.

ఇలా చూసుకుంటే ఫిబ్రవరి నెలలో విడుదల కానున్న శాకుంతలం, సార్, వినరో భాగ్యము విష్ణు కథ, అమిగోస్ వంటి చిత్రాలపై మంచి అంచనాలే ఉన్నాయి. మరి ఈ చిత్రాలు ఎలాంటి ఫలితాలను రాబడతాయో వేచి చూడాలి. ఈ సినిమాలన్నీ మంచి కాన్సెప్ట్ లతో రూపొందుతున్న చిత్రాలే కావడం.. కంటెంట్ పరంగా స్ట్రాంగ్ గా ఉన్నాయని తెలుస్తుండడంతో ఈ ఫిబ్రవరి కూడా జనవరి లాగానే సినిమా వారికి సంతోషాన్ని మిగిల్చే నెలగా మారుతుందని చెప్పుకోవచ్చు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.