English | Telugu

డైరెక్టర్ క్రిష్ కి ఏమైంది..?

టాలీవుడ్ లో ప్రతిభగల దర్శకులలో క్రిష్ ఒకరు. వైవిధ్యమైన కథలకు, బలమైన భావోద్వేగాలకు ఆయన పెట్టింది పేరు. అలాంటి క్రిష్.. సక్సెస్ చూసి చాలా కాలమైంది. దీంతో అసలు క్రిష్ కి ఏమైంది? అంటూ సినీ అభిమానుల్లో చర్చ జరుగుతోంది. (Krish Jagarlamudi)

2008లో విడుదలైన 'గమ్యం'తో దర్శకుడిగా పరిచయమైన క్రిష్.. మొదటి సినిమాతోనే విమర్శకుల ప్రశంసలు, ప్రేక్షకుల మెప్పు పొందారు. ఆ తర్వాత వేదం, కృష్ణం వందే జగద్గురుమ్, కంచె, గౌతమిపుత్ర శాతకర్ణి వంటి వైవిద్యభరితమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు.

2017లో వచ్చిన 'గౌతమిపుత్ర శాతకర్ణి' తర్వాత క్రిష్ సక్సెస్ చూడలేదు. ఓ రకంగా బ్యాడ్ టైం స్టార్ట్ అయిందని చెప్పవచ్చు. బాలకృష్ణతో చేసిన ఎన్టీఆర్ బయోపిక్ కి ప్రశంసలు దక్కాయి కానీ, బాక్సాఫీస్ దగ్గర కాసులు కురవలేదు. హిందీలో 'మణికర్ణిక' చేయగా.. ఏదో వివాదమై కంగనా రనౌత్ డైరెక్టర్ గా తన పేరు కూడా వేసుకుంది. ఇక 2021 లో 'కొండపొలం' విడుదల కాగా, అది ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. పవన్ కళ్యాణ్ తో 'హరి హర వీరమల్లు' అనే భారీ సినిమాను మొదలుపెట్టి, బాగా ఆలస్యమవ్వడంతో మధ్యలోనే బయటకు వచ్చేశారు. అదీ పరాజయం పాలైంది. అనుష్కతో చేసిన 'ఘాటి'తో సాలిడ్ కమ్ బ్యాక్ ఇవ్వాలనుకున్నారు క్రిష్. కానీ, తాజాగా థియేటర్లలో అడుగుపెట్టిన ఈ మూవీ.. డివైడ్ టాక్ ని సొంతం చేసుకుంది. దీంతో క్రిష్ ఖాతాలో మరో ఫ్లాప్ పడేలా ఉంది.

ఫ్లాప్ పడినంత మాత్రాన క్రిష్ ని ఎవరూ తక్కువంచనా వేయరు. ఆయన ప్రతిభ ఏంటో అందరికీ తెలుసు. సరైన కంటెంట్ దొరికితే వండర్స్ క్రియేట్ చేయగలరు. క్రిష్ తన తదుపరి సినిమాని బాలకృష్ణతో చేసే అవకాశముంది. ఇది 'ఆదిత్య 369'కి సీక్వెల్ అనే ప్రచారం ఉంది. తన నెక్స్ట్ ఫిల్మ్ తోనైనా క్రిష్ కమ్ బ్యాక్ ఇస్తారని ఆశిద్దాం.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.