English | Telugu

ఘనంగా సైమా అవార్డుల వేడుక.. విజేతలు వీరే!

దుబాయ్‌ వేదికగా సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌(సైమా 2025) 13వ ఎడిషన్‌ ఘనంగా జరిగింది. మొదటి రోజు 2024లో రూపొందిన తెలుగు, కన్నడ చిత్రాలకు సంబంధించిన పురస్కారాలను అందజేశారు. కల్కి 2898ఎడి, పుష్ప2 చిత్రాలకు నాలుగు విభాగాల్లో అవార్డులు దక్కాయి. ప్రేక్షకుల్ని ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లిన కల్కి 2898ఎడి చిత్రానికి ఉత్తమ చిత్రం అవార్డు, పుష్ప2 చిత్రంలో అద్భుతమైన నటనను ప్రదర్శించిన అల్లు అర్జున్‌కి ఉత్తమ నటుడుగా, ఉత్తమ నటిగా రష్మిక మందన్న అవార్డులు అందుకున్నారు. ఉత్తమ దర్శకుడిగా సుకుమార్‌, ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవిశ్రీప్రసాద్‌, ప్రైడ్‌ ఆఫ్‌ తెలుగు సినిమా అవార్డును వైజయంతీ మూవీస్‌ అధినేత అశ్వినీదత్‌ అందుకున్నారు.

2025 సైమా అవార్డుల విజేతలు వీరే:

ఉత్తమ చిత్రం: కల్కి 2898 ఏడీ
ఉత్తమ నటుడు: అల్లు అర్జున్‌ (పుష్ప2)
ఉత్తమ నటి: రష్మిక (పుష్ప2)
ఉత్తమ దర్శకుడు: సుకుమార్‌ (పుష్ప2)
ఉత్తమ విలన్‌: కమల్‌ హాసన్‌ (కల్కి 2898 ఏడీ)
ఉత్తమ సహాయ నటుడు: అమితాబ్‌ బచ్చన్‌ (కల్కి 2898 ఏడీ)
ఉత్తమ సహాయ నటి: అన్నా బెన్‌ (కల్కి 2898 ఏడీ)
ప్రైడ్‌ ఆఫ్‌ తెలుగు సినిమా : అశ్వినీదత్‌ (వైజయంతీ మూవీస్‌)
ఉత్తమ సంగీత దర్శకుడు: దేవిశ్రీ ప్రసాద్‌ (పుష్ప2)
ఉత్తమ దర్శకుడు (క్రిటిక్స్‌): ప్రశాంత్‌వర్మ (హనుమాన్‌)
ఉత్తమ సినిమాటోగ్రఫీ: రత్నవేలు (దేవర)
ఉత్తమ గీత రచయిత: రామజోగయ్య శాస్త్రి (చుట్టమల్లే)
ఉత్తమ నేపథ్య గాయని: శిల్పారావ్‌ (చుట్టమల్లే)
ఉత్తమ నూతన నటి: భాగ్యశ్రీ బోర్సే (మిస్టర్‌ బచ్చన్‌)
ఉత్తమ హాస్య నటుడు: సత్య (మత్తు వదలరా 2)
ఉత్తమ నూతన నిర్మాత : నిహారిక కొణిదెల (కమిటీ కుర్రోళ్లు)
ఉత్తమ నటుడు (క్రిటిక్స్‌): తేజ సజ్జా (హనుమాన్‌)
ఉత్తమ నటి (క్రిటిక్స్‌): మీనాక్షి చౌదరి (లక్కీ భాస్కర్‌)

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.