English | Telugu

38 భాషలు, 240 దేశాలు.. ప్రపంచానికి అందుబాటులో నాగ చైతన్య!

ప్రస్తుతం థియేటర్లకు గట్టిపోటీ ఇస్తున్న మాధ్యమం ఓటీటీ. సినిమాలు రిలీజ్‌ అయిన నెలరోజుల్లోనే ఓటీటీలో ప్రత్యక్షమవుతున్నాయి. దీంతో థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గింది. దానికితోడు వెబ్‌ సిరీస్‌లు కూడా సినిమాలకు ధీటుగా ఉంటున్నాయి. సినిమా చూసిన అనుభూతినే కలిగిస్తుండడంతో వెబ్‌సిరీస్‌లకు ఆదరణ బాగా పెరిగింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని స్టార్‌ హీరోలు, స్టార్‌ హీరోయిన్లు సైతం వెబ్‌ సిరీస్‌లలో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే చాలామంది స్టార్లు వెబ్‌ సిరీస్‌లు చేసి సక్సెస్‌ అయ్యారు. తాజాగా నాగచైతన్య కూడా ‘ధూత’ పేరుతో వచ్చిన వెబ్‌సిరీస్‌లో నటించాడు. ఈ వెబ్‌ సిరీస్‌ను విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వంలో శరత్‌ మరార్‌ నిర్మించారు.

‘ధూత’కు వస్తున్న రెస్పాన్స్‌, ఈ వెబ్‌సిరీస్‌ విశేషాల గురించి శరత్‌ మరార్‌ మాట్లాడుతూ ‘విక్రమ్‌ కుమార్‌ ఈ కథ చెప్పినపుడు చైతుకి, నాకు బాగా నచ్చింది. ఈ కథని విక్రమ్‌ చాలా బాగా హ్యాండిల్‌ చేశారు. ఆడియన్స్‌ ఎక్స్‌పెక్ట్‌ చెయ్యని విధంగా ఎంతో కేర్‌ తీసుకుని కథను నడిపించారు. అందుకే ఈ సిరీస్‌ ప్రతి ఒక్కరినీ అలరిస్తోంది. సింపుల్‌ కథే అయినప్పటికీ ట్రీట్‌మెంట్‌ కథకి కొత్త అందాన్నిచ్చింది. అదే దీనికి బాగా ప్లస్‌ అయింది. ఈ సిరీస్‌ను ఇతర భాషల్లో సబ్‌ టైటిల్స్‌తో స్ట్రీమ్‌ అవుతోంది. మొత్తం 38 భాషల్లో 240 దేశాల ప్రజలకు ‘ధూత’ అందుబాటులో ఉంది. ఈ విషయంలో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఈ వెబ్‌సిరీస్‌ మా బేనర్‌ పేరును నెక్స్‌ట్‌ లెవల్‌కి తీసుకెళ్లింది. ఈ సిరీస్‌ సక్సెస్‌ కావడంతో భవిష్యత్తులో మరిన్ని మంచి ప్రాజెక్టులు చేసేందుకు ఉత్సాహాన్నిచ్చింది. ఈ సిరీస్‌కి సంబంధించి మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఈ కథంతా వర్షంలోనే నడుస్తుందని, వర్షం కూడా ఒక పాత్రలా ఉంటుందని విక్రమ్‌ ముందుగానే చెప్పారు. ఈ సిరీస్‌ మొత్తం పూర్తయ్యే సరికి వర్షం ఎఫెక్ట్‌ కోసం 300కిపైగా ట్యాంకర్లను తెప్పించాల్సి వచ్చింది. విక్రమ్‌కుమార్‌గారు చెప్పినట్టుగానే ఈ కథకు వర్షం తోడవడం వల్ల ఎంతో ఎఫెక్టివ్‌గా అనిపించింది’ అన్నారు.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.