English | Telugu

వైజయంతీ మూవీస్ సంచలనం.. 'మెగా 157' ఆగిపోయినట్టేనా!

మెగాస్టార్ చిరంజీవి తన 157వ సినిమాని 'బింబిసార' ఫేమ్ మల్లిడి వశిష్ట దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సోషియో ఫాంట‌సీ ఫిల్మ్ ని యూవీ క్రియేషన్స్ నిర్మించనుంది. ఇది 'జగదేకవీరుడు అతిలోకసుందరి' తరహాలో ఉంటుందని, ఆ సినిమాకి దీనికి చాలా పోలికలు ఉంటాయని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తమ సినిమా 'జగదేకవీరుడు అతిలోకసుందరి' కంటెంట్ ని అనధికారికంగా ఉపయోగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ వైజయంతీ మూవీస్ ప్రకటించడం సంచలనంగా మారింది.

చిరంజీవి, శ్రీదేవి జంటగా కె. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో రూపొందిన సోషియో ఫాంటసీ చిత్రం 'జగదేకవీరుడు అతిలోకసుందరి'. వైజయంతీ మూవీస్ నిర్మించిన ఈ సినిమా 1990లో విడుదలై ఎంతటి సంచలన విజయం సాధిందో తెలిసిందే. ఈ సినిమా రీమేక్ చేయాలని లేదా సీక్వెల్ చేయాలని ఎప్పటినుంచో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మళ్ళీ చిరంజీవే ఈ తరహా సినిమా చేయబోతున్నాడనే వార్త అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే ఇప్పుడు 'జగదేకవీరుడు అతిలోకసుందరి'పై పూర్తి హక్కులు తమకే ఉన్నాయని.. రీమేక్, సీక్వెల్, ప్రీక్వెల్, వెబ్ సిరీస్ ఏం చేయాలన్నా తమకే హక్కు ఉంటుందని, మేం ఎవరికీ హక్కులను ఇవ్వలేదని వైజయంతీ మూవీస్ ప్రకటించింది. తమ అనుమతి లేకుండా కంటెంట్ ని ఉపయోగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపింది. వైజయంతీ మూవీస్ ఉన్నట్టుండి ఈ ప్రకటన చేయడం పరోక్షంగా 'మెగా 157'ని ఉద్దేశించే అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి 'మెగా 157' టీం వైజయంతీ మూవీస్ దగ్గర అనుమతి తీసుకొని ముందుకు వెళ్తుందో లేక ప్రాజెక్ట్ కి బ్రేక్ లు ఏమైనా పడతాయో చూడాలి.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.