English | Telugu

సిబిఐ ముందుకు హీరో విశాల్..అభిమానుల్లో కలవరం 

విశాల్ డ్యూయల్ రోల్ లో నటించగా ఇటీవల తమిళ, తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం మార్క్ అంథోని. ఈ చిత్రం తమిళనాట హిట్ అవ్వగా తెలుగులో మాత్రం అంతగా ఆడలేదు. విశాల్ సరసన అభినయ, రీతూ వర్మ లు నటించగా ప్రముఖ దర్శకుడు ,నటుడు అయిన ఎస్ జె సూర్య విలన్ గా నటించాడు. ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన ఒక విషయం గురించి విశాల్ తన ట్విటర్ వేదికగా చేసిన ఒక పోస్ట్ విశాల్ అభిమానులని షాక్ కి గురి చేస్తుంది.

విశాల్ తన మార్క్ ఆంథోనీ మూవీని హిందీలో కూడా విడుదల చెయ్యాలని భావించి హిందీ సెన్సార్ సర్టిఫికెట్ కోసం అడిగితే తనని సెన్సార్ వాళ్ళు డబ్బులు అడిగారని 6 లక్షలు రూపాయలు చెల్లించారని విశాల్ ఆరోపణ చేసిన విషయం అందరికి తెలిసిందే. విశాల్ చెప్పిన ఈ న్యూస్ భారతీయ చిత్రపరిశ్రమ మొత్తాన్ని షేక్ అయ్యేలా చేసింది. ఇప్పుడు విశాల్ హిందీ చిత్ర సీమకి చెందిన సెన్సార్ వాళ్ళ మీద చేసిన ఆరోపణలకి సంబంధించి సిబిఐ ముందు హాజరవుతున్నాడు. ఈ విషయాన్నే విశాల్ సోషల్ మీడియాలో ప్రస్తావిస్తు నేను నా మార్క్ ఆంథోనీ మూవీ విషయంలో బాలీవుడ్ చిత్ర పరిశ్రమకి చెందిన సెన్సార్ వాళ్ళకి లంచం ఇచ్చానని చేసిన ఆరోపణల మీద ముంబై సి బి ఐ ఆఫీస్ కి వెళ్తున్నానని పోస్ట్ చేసాడు.

ఇప్పుడు విశాల్ చేసిన ఆ పోస్ట్ ని చూసిన ఫాన్స్ లో కలవరం మొదలయ్యింది. అలాగే కొంత మంది అభిమానులు అయితే విశాల్ కి అండగా ఉంటామని ఈ కేసు విషయం లో ఆయనతో పాటు ఎంతవరకైనా నడవడానికి సిద్ధం అని కూడా అంటున్నారు.మార్క్ ఆంథోనీ కి విశాల్ నే నిర్మాత.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .