English | Telugu

డ్రగ్స్‌ కేసులో హీరోయిన్‌ వరలక్ష్మీ శరత్‌కుమార్‌కు సమన్లు

నటుడు శరత్‌కుమార్‌ కుమార్తె వరలక్ష్మీ శరత్‌కుమార్‌ తెలుగు, తమిళ్‌, మలయాళ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇప్పుడామెకు ఓ సమస్య వచ్చి పడింది. డ్రగ్స్‌ కేసులో కొచ్చి ఎన్‌ఐఎ అధికారులు ఆమెకు సమన్లు జారీ చేశారు. చాలా సంవత్సరాలుగా వరలక్ష్మీ శరత్‌కుమార్‌ వద్ద పి.ఎ.గా పనిచేస్తున్న ఆదిలింగం నుడ్రగ్స్‌ కేసులో ప్రధాన నిందితుడిగా తేల్చారు పోలీసులు. అతనికి అంతర్జాతీయ డ్రగ్స్‌ రాకెట్‌తో సంబంధాలున్నట్లు ఎన్‌ఐఎ అధికారులు అనుమానిస్తున్నారు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. డ్రగ్స్‌ ద్వారా సంపాదించిన డబ్బును చిత్ర పరిశ్రమలో పెట్టుబడులు పెట్టినట్టు విచారణలో పోలీసులు గుర్తించారు. దానికి వరలక్ష్మీ శరత్‌కుమార్‌ సహకారం కూడా ఉందని ఎన్‌ఐఎ అధికారులు భావిస్తున్నారు. ఆమె దగ్గర పనిచేసిన ఆదిలింగంకు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. దాని కోసం ఆమెకు సమన్లు జారీ చేసి విచారణకు హాజరుకావాలని చెప్పారు. ఆదిలింగం దగ్గర కోలీవుడ్‌లో ఇంకా ఎవరెవరి ఫోన్‌ నంబర్లు ఉన్నాయో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అంతేకాకుండా ఈ కేసుతో టాలీవుడ్‌ ప్రముఖులకు ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో కూడా ఎన్‌ఐఎ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .