English | Telugu

బేబీ హీరోయిన్ ఆ ఐటెం సాంగ్ కి ఒప్పుకుంటుందా?

జులైలో వచ్చి ఘన విజయం సాధించిన బేబీ సినిమా తాలూకు గుర్తులని ఇంకా ఎవరు మర్చిపోలేదు.ఆ మూవీలో టైటిల్ రోల్ లో వైష్ణవి చైతన్య ప్రదర్శించిన నటనకి వర్షాలని సైతం లెక్కచేయకుండా యూత్ మొత్తం థియేటర్స్ కి పరుగులు తీసింది. అలాగే ఎంతో మంది ఆ మూవీతో వైష్ణవికి అభిమానులుగా కూడా మారారు.ఇప్పుడు వైష్ణవి గురించి ఫిలింనగర్ లో వినిపిస్తున్న ఒక మాట ఆమె అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులని షాక్ కి గురి చేస్తుంది.

బేబీ సినిమా తర్వాత వైష్ణవి నుంచి ఇంకా ఎలాంటి కొత్త సినిమా స్టార్ట్ అవ్వలేదు.ఆమె కొత్త సినిమా ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని అభిమానులు ఎదురుచూస్తున్న టైం లో ఇప్పుడు పూరి జగన్నాధ్ ,రామ్ పోతినేని ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న డబుల్ ఇస్మార్ట్ లో వైష్ణవి ఒక ఐటెం సాంగ్ లో నర్తించబోతుందని అంటున్నారు.ఇప్పుడు ఈ వార్తతో ఆమె అభిమానులు షాక్ కి గురవుతున్నారు. ఈ వార్త నిజం కాకూడదని కోరుకుంటున్నారు. ఎందుకంటే బేబీ విజయంలో కీలక పాత్ర పోషించిన వైష్ణవి అగ్ర హీరోయిన్ రేంజ్ కి వెళ్తుందని భావిస్తున్న వేళ కేవలం రెండో సినిమాకే ఐటెం సాంగ్ చెయ్యడం ఆమె కెరీర్ కి మంచిది కాదని అంటున్నారు.

అసలు కొన్ని రోజుల క్రితం డబుల్ ఇస్మార్ట్ లో సెకండ్ హీరోయిన్ గా వైష్ణవిని ఎంపిక చేసారు అనే వార్తలు వచ్చాయి. కానీ అది నిజం కాదని తెలిసింది. ఇప్పుడేమో అదే సినిమాలో వైష్ణవి ఐటెం సాంగ్ చెయ్యబోతుందనే వార్తలు వస్తున్నాయి. అసలు నిజం ఏంటో కొన్ని రోజులు అయితే గాని తెలియదు.అలాగే సోషల్ మీడియా లో ఎప్పుడు యాక్టీవ్ గా ఉండే వైష్ణవి అయినా తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి వస్తున్న వార్తలపై క్లారిటీ ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.