English | Telugu

సలార్.. బాహుబలి, కేజీఎఫ్ కంటే ఎక్కువే!

ప్రస్తుతం సినీ అభిమానుల దృష్టి 'సలార్'పై ఉంది. ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో రూపొందుతోన్న ఈ యాక్షన్ థ్రిల్లర్ పై భారీ అంచనాలున్నాయి. హోంబలే ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ మూవీ రెండు భాగాలుగా రానుంది. మొదటి భాగం 'సీజ్ ఫైర్' డిసెంబర్ 22న విడుదల కానుంది. అయితే ఇప్పుడు ఈ చిత్ర నిడివి ఆసక్తికరంగా మారింది.

కొన్ని భారీ సినిమాలు మూడు గంటల నిడివి ఉండటం సహజం. అయితే రెండు భాగాలుగా వచ్చే సినిమాలు మాత్రం.. ఒక్కో భాగం రెండున్నర గంటల నుంచి 2 గంటల 45 నిమిషాల లోపు నిడివి కలిగి ఉంటాయి. కానీ సలార్ మొదటి భాగమే దాదాపు మూడు గంటల నిడివి ఉంటుందని తెలుస్తోంది. దర్శకుడు ప్రశాంత్ నీల్ సలార్ ఫస్ట్ పార్ట్ ని 2 గంటల 55 నిమిషాల నిడివితో లాక్ చేశాడని సమాచారం. ఇది 'బాహుబలి' ఫ్రాంచైజ్, 'కేజీఎఫ్' ఫ్రాంచైజ్ సినిమాల నిడివి కంటే ఎక్కువ కావడం విశేషం. సినిమాలో కంటెంట్ ఉంటే నిడివి అనేది సమస్య కాదు. మరి బాహుబలి హీరో ప్రభాస్, కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న ఈ మూవీ బిగ్ స్క్రీన్ పై ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.

శత్రువులుగా మారిన ఇద్దరు స్నేహితులు కథగా వస్తున్న సలార్ లో పృథ్వీరాజ్ సుకుమారన్, శ్రుతి హాసన్, జగపతి బాబు, ఈశ్వరీ రావు తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.