English | Telugu

సలార్.. బాహుబలి, కేజీఎఫ్ కంటే ఎక్కువే!

ప్రస్తుతం సినీ అభిమానుల దృష్టి 'సలార్'పై ఉంది. ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో రూపొందుతోన్న ఈ యాక్షన్ థ్రిల్లర్ పై భారీ అంచనాలున్నాయి. హోంబలే ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ మూవీ రెండు భాగాలుగా రానుంది. మొదటి భాగం 'సీజ్ ఫైర్' డిసెంబర్ 22న విడుదల కానుంది. అయితే ఇప్పుడు ఈ చిత్ర నిడివి ఆసక్తికరంగా మారింది.

కొన్ని భారీ సినిమాలు మూడు గంటల నిడివి ఉండటం సహజం. అయితే రెండు భాగాలుగా వచ్చే సినిమాలు మాత్రం.. ఒక్కో భాగం రెండున్నర గంటల నుంచి 2 గంటల 45 నిమిషాల లోపు నిడివి కలిగి ఉంటాయి. కానీ సలార్ మొదటి భాగమే దాదాపు మూడు గంటల నిడివి ఉంటుందని తెలుస్తోంది. దర్శకుడు ప్రశాంత్ నీల్ సలార్ ఫస్ట్ పార్ట్ ని 2 గంటల 55 నిమిషాల నిడివితో లాక్ చేశాడని సమాచారం. ఇది 'బాహుబలి' ఫ్రాంచైజ్, 'కేజీఎఫ్' ఫ్రాంచైజ్ సినిమాల నిడివి కంటే ఎక్కువ కావడం విశేషం. సినిమాలో కంటెంట్ ఉంటే నిడివి అనేది సమస్య కాదు. మరి బాహుబలి హీరో ప్రభాస్, కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న ఈ మూవీ బిగ్ స్క్రీన్ పై ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.

శత్రువులుగా మారిన ఇద్దరు స్నేహితులు కథగా వస్తున్న సలార్ లో పృథ్వీరాజ్ సుకుమారన్, శ్రుతి హాసన్, జగపతి బాబు, ఈశ్వరీ రావు తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .