English | Telugu

ఊర్వశీ రౌతెలాకు శాపంగా మారిన ఇండియా-పాకిస్తాన్‌ మ్యాచ్‌!

వరల్డ్‌ కప్‌ క్రికెట్‌లో భారత, పాకిస్థాన్‌ మ్యాచ్‌ అంటే ఆ క్రేజ్‌ మామూలుగా వుండదు. ఇండియా టీమ్‌తో సహా ప్రతి ఒక్కరూ ఎంతో ప్రెస్టీజియస్‌గా తీసుకునే ఈ మ్యాచ్‌లో ఇండియా విజయం సాధించింది. అందరూ ఆనందోత్సాహంతో పండగ చేసుకున్నారు. అయితే, హీరోయిన్‌ ఊర్వశీ రౌతేలా విషయంలో మాత్రం ఆ మ్యాచ్‌ ఒక శాపంలా పరిణమించింది. ఎంతో ఆసక్తికరంగా సాగుతున్న మ్యాచ్‌ను వీక్షించడంలో నిమగ్నమైపోయిన ఊర్వశి ఎంతో ఖరీదైన తన మొబైల్‌ ఫోన్‌ను పోగొట్టుకుంది.

ఈ విషయాన్ని ఇన్‌స్టా గ్రామ్‌ ద్వారా తెలియజేసింది. తాను పోగొట్టుకున్న మొబైల్‌ ఎంతో ఖరీదైందని, అది 24 క్యారెట్ల బంగారం తాపడం చేసిన ఫోన్‌ అని వివరించిందది. తన మొబైల్‌ ఎవరికైనా దొరికితే తిరిగి ఇవ్వాలని కోరుతోంది. ఈ పోస్టుకు పోలీసులు, స్టేడియం అధికారిక ఎక్స్‌ ఖాతాలను ట్యాగ్‌ చేశారు. ఆమె పోస్టును చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్స్‌ పెడుతున్నారు. ఇది పబ్లిసిటీ కోసం చేస్తున్న పని అని కొందరు అంటుంటే, ఫోన్‌ ఎవరికైతే దొరికిందో అతను అదృష్టవంతుడని మరికొందరు కామెంట్‌ చేస్తున్నారు. బంగారంతో కూడిన అంత ఖరీదైన ఫోన్‌ ఎవరికైనా దొరికితే తిరిగి ఇస్తారా? అని ప్రశ్నిస్తున్నారు. కొన్ని తెలుగు సినిమాల్లో స్పెషల్‌ సాంగ్స్‌ చేసిన ఊర్వశి రౌతేలా.. వాల్తేరు వీరయ్య, స్కంద చిత్రాల్లో తన అందాలతో అందర్నీ అలరించింది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .