English | Telugu

పవన్ కోసం ఎదురు చూస్తున్న ఆ ఇద్దరు!

ఒకప్పుడు భారీ చిత్రాల నిర్మాత అంటే ఎ.యం.ర‌త్నం పేరు చెప్పుకునేవారు. కోలీవుడ్‌లో భారీ బడ్జెట్ తో రూపొందిన చిత్రాలను ఈయన తెలుగులో విడుదల చేసేవారు. అలా ఈయన తెలుగులో విడుదల చేసిన చిత్రాలు అనేకం బ్లాక్ బస్టర్ హిట్స్ సొంతం చేసుకున్నాయి. ఇక తెలుగులో కూడా విజ‌య‌శాంతితో క‌ర్త‌వ్యం, ఆశ‌యం వంటి చిత్రాల‌ను మోహ‌న‌గాంధీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందించాడు. ఇక తానే మెగాఫోన్ చేత‌ప‌ట్టి పెద్ద‌రికం సినిమా తీశారు. ఆ త‌ర్వాత సంక‌ల్పం సినిమా తీశారు. క‌ర్త‌వ్యం, పెద్ద‌రికం చిత్రాలు విజ‌యం సాధించ‌గా, ఆశ‌యం, సంక‌ల్పం చిత్రాలు బాగా ఆడ‌లేదు. కానీ ఆ తర్వాత తన కుమారులను హీరో డైరెక్టర్లుగా ప్రమోట్ చేసే విషయంలో ఆయన నిర్మించిన చిత్రాలు బాగా నష్టాలను కలిగించాయి. అలాంటి సమయంలో కోలీవుడ్ స్టార్ తల అజిత్ ఈయనకు వరుస చిత్రాలు చేసి పెట్టారు. దాంతో ఆర్థికంగా ఈయన మరలా పుంజుకున్నారు.

ఇక ఈయన తెలుగులో పవన్ కళ్యాణ్ తో ఖుషీ, బంగారం వంటి రెండు చిత్రాలను నిర్మించారు. ఇప్పుడు హరిహర వీరమల్లు అనే పీరియాడికల్ మూవీని మొదలుపెట్టారు. తెలంగాణ రాబిన్‌హుడ్‌ గా పేరు తెచ్చుకున్న పండుగల సాయన్న పాత్రలో పవన్ నటిస్తాడని ప్రచారం జరుగుతుంది. పవన్ సరసన నిధి అగర్వాల్ నటిస్తోంది. ఈ సినిమాకు మొదలైనప్పటి నుంచి అవాంతరాలు ఎదురవుతున్నాయి. పవన్ రాజకీయాల్లో బిజీగా ఉన్న కారణంగా అనుకున్న విధంగా షెడ్యూల్స్ పూర్తి కావడం లేదు. ఏఎం రత్నం మాత్రం ఈ చిత్రంపై ఎంతో నమ్మకంగా ఉన్నారు. ఈ చిత్రానికి దర్శకుడు క్రిష్ జాగర్లమూడి. ఈయ‌న నిజంగా సినిమాలను అత్యంత వేగంగా తీయ‌గ‌ల‌రు. క్వాలిటీ మిస్ కాకుండానే అతి తక్కువ స‌మ‌యంలో ఇలాంటి పీరియాడికల్ స్టోరీల‌ను తీయగలిగిన ప్రతిభ ఆయనకు ఉంది. గతంలో గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రాన్ని ఆయన ఎంతో వేగంగా అతి తక్కువ బడ్జెట్ తో పూర్తి చేసి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు.

కాగా హరిహర వీరమల్లు చిత్రం పూర్తి చేయకుండా పవన్ మరోవైపు తమిళ రీమేక్ చిత్రం వినోదాయసిత్తమును ప్రారంభించారు. మరో వైపు తేరీ రీమేక్‌గా ఉస్తాద్ భగత్ సింగ్ ను బరిలోకి దించుతున్నారు. సుజిత్ తో ఓ జి చేస్తున్నారు. ఇలా హరిహర వీరమల్లు కంటే తరువాత వచ్చిన చిత్రాలు సెట్స్ పైకి వెళుతూ వుండటంతో కృష్ జాగర్లమూడికి ఏఎం రత్నంకి పవన్ కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. మొదటగా మొదలైన చిత్రాన్ని మొదట పూర్తి చేయాలి. కానీ ఆ చిత్రాన్ని అలాగే పెండింగ్‌లో ఉంచి కొత్తగా వచ్చిన చిత్రాలను సెట్స్ పైకి తీసుకుని వెళుతూ ఉంటే అటు హీరోను ఏమీ అనలేక ఏయం రత్నం క్రిష్ జాగర్లమూడి మౌనం వహిస్తున్నట్టు ఇండస్ట్రీ టాక్. మరీ పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా హరిహర వీరమల్లు దర్శకనిర్మాతలు పడుతున్న కష్టాలను చూసి దానికి సమయాన్ని కేటాయిస్తాడేమో వేచి చూడాలి.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.