English | Telugu

‘లియో’ హిట్టా..ఫట్టా... కలెక్షన్లు వచ్చాయా.. రాలేదా?.. ఒకటే కన్‌ఫ్యూజన్‌!

విజయ్‌, లోకేష్‌ కనకరాజ్‌ కాంబినేషన్‌లో రూపొందిన ‘లియో’కి వచ్చిన హైప్‌ మామూలుది కాదు. రిలీజ్‌కి ముందే సినిమాని ఒక రేంజ్‌కి తీసుకెళ్ళి నిలబెట్టిందా హైప్‌. లోకేష్‌ క్రియేట్‌ చేసిన ఎల్‌సియులో భాగంగా లియో సినిమా వచ్చిన విషయం తెలిసిందే. సినిమాకి హైప్‌ పెరగడంతో భారీ అంచనాల మధ్య ఈ సినిమా వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ అయింది. ‘లియో’ విజయ్‌ కెరీర్‌లోనే ఫస్ట్‌ ఫాన్‌ ఇండియా మూవీ కావడం విశేషం. ఈ సినిమా ఎల్‌సియులో భాగమే అన్నట్టుగా ప్రచారం జరిగింది. కానీ, సినిమాలో అలాంటి క్లూ ఒక్కటి కూడా లేదు. అందరూ ఎల్‌సియులో భాగమే అని అందరూ అనుకోవడంతో బజ్‌ క్రియేట్‌ అయింది. మరి దానికి తగ్గట్టుగా కలెక్షన్స్‌ ఉన్నాయా? నిర్మాతలు చెబుతున్నవి కరెక్ట్‌ లెక్కలేనా? అందులో ఏదైనా మతలబు వుందా? అనే కోణంలో అందరూ ఆలోచిస్తున్నారు.

‘లియో’ చిత్రం మొదటి రోజు కలెక్షన్స్‌ రికార్డు స్థాయిలో ఉన్నాయని ట్రేడ్‌ వర్గాలు తెలిపాయి. రూ.140 కోట్లకు పైగా కలెక్ట్‌ చేసిందని ప్రకటించారు. దీన్ని బట్టే తర్వాతి మూడు రోజులు కూడా భారీగా లెక్కలు చూపించారు. ఇదిలా ఉంటే యు.ఎస్‌. కలెక్షన్స్‌ విషయంలో తప్పు జరిగిందని, మేకర్స్‌ రిలీజ్‌ చేసిన పోస్టర్లన్నీ క్రియేట్‌ చేసినవేనని కోలీవుడ్‌ వర్గాలే విమర్శించడం గమనార్హం. మేకర్స్‌ చెబుతున్న లెక్కలు, కోలీవుడ్‌ వర్గాల విమర్శల్లో ఎంత వరకు నిజముందో తెలీదుగానీ, వారంరోజుల్లో ఈ సినిమా రూ.500 కోట్లు గ్రాస్‌ కలెక్ట్‌ చేసిందనే టాక్‌ మాత్రం వినిపిస్తోంది. మరోపక్క కోలీవుడ్‌లోని అన్ని ఏరియాల్లో ఈ సినిమా బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్‌ను కంప్లీట్‌ చేసిందని చెబుతున్నారు. కొన్ని ఏరియాలు మినహాయిస్తే దాదాపు అన్ని చోట్లా లాభాల్లోకి వెళ్లిపోయిందని సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో రూ. 40 కోట్లకు పైగా గ్రాస్‌.. రూ. 20 కోట్లకు పైగా షేర్‌ వచ్చిందని ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి. అంటే.. డబ్బింగ్‌ సినిమాలలో లియో హయ్యస్ట్‌ గ్రాసర్‌ కాబోతోందన్నమాట. తెలుగు రాష్ట్రాలలో ఎలాంటి కన్‌ఫ్యూజన్‌ లేకుండా లెక్కలు కనిపిస్తుండగా తమిళ్‌, యు.ఎస్‌ల కలెక్షన్స్‌ మాత్రం విమర్శలు ఎదుర్కొంటున్నాయి. ఏ సినిమాకీ రాని సమస్య ఇంత పెద్ద సినిమా ఫేస్‌ చెయ్యడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అసలు ఈ కన్‌ఫ్యూజన్‌కి కారణం ఏమిటి? అనేది మేకర్స్‌ తేల్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.