English | Telugu

దాన్ని ఎంజాయ్ చేస్తున్నానంటున్న మిల్కీబ్యూటీ!

ఈ మ‌ధ్య కాలంలో ఏ హీరోయినూ కాని విధంగా ట్రెండ్ అయ్యారు త‌మ‌న్నా భాటియా. బ్యాక్ టు బ్యాక్ రెండు వెబ్ సీరీస్‌ల‌లో రెచ్చిపోయి న‌టించారు. ఇప్ప‌టిదాకా స్క్రీన్ మీద హ‌ద్దుల్లో ఉన్న త‌మ‌న్నా, ఇప్పుడు స‌రిహ‌ద్దులు చెరిపేశాన‌ని అంటున్నారు. ఆమె న‌టించిన ల‌స్ట్ స్టోరీస్‌-2 కి కామ‌న్ ఆడియ‌న్స్ నుంచి మాత్ర‌మే కాదు, సెల‌బ్రిటీల నుంచి కూడా వావ్ అంటూ స్పంద‌న వ‌స్తోంది. త‌మ‌న్నాలో ఈ యాంగిల్ ఊహించ‌లేదు, ఇర‌గ‌దీసేశార‌నే కాంప్లిమెంట్స్ అందుతున్నాయి.

త‌మ‌న్నా మాట్లాడుతూ "ఇంటిమేట్ సీన్స్‌ని నా ఫ్యామిలీతో క‌లిసి కూర్చుని చూడ‌టానికి చాలా ఇబ్బందిప‌డిపోయేదాన్ని. టీవీలో ఆ స‌న్నివేశాలు రాగానే, చుట్టూ చూస్తూ కూర్చునేదాన్ని. లేకుంటే ఏదో ప‌ని ఉన్న‌ట్టు అక్క‌డి నుంచి వెళ్లిపోయేదాన్ని. చాలా అస‌హ‌నంగా అనిపించేది. అందుకే నేను న‌టించిన సినిమాల్లోనూ అవి లేకుండా ఉండేలా జాగ్ర‌త్త‌ప‌డేదాన్ని. ఫిల్మ్ మేక‌ర్స్ తో ముందే ఈ విష‌యం గురించి చ‌ర్చించేదాన్ని. కానీ ఇప్పుడు ప‌రిస్థితి వేరు. 15 ఏళ్ల‌కే ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన నేను అన్ని ర‌కాల పాత్ర‌లూ చేసేశాను. మాన‌సికంగా ఎంతో ప‌రిప‌క్వ‌త వ‌చ్చింది. దాన్నే స్క్రీన్ మీద ప్రెజెంట్ చేయాల‌ని అనుకున్నాను. చేసిందే చేస్తానంటే ఆడియ‌న్స్ కి బోర్ కొట్టేస్తుంది. నా ప్రేక్ష‌కులు బోర్ ఫీల్ కావ‌డం నాకు న‌చ్చ‌దు. అందుకే ఓ నిర్ణ‌యానికి వ‌చ్చేశాను. ఇంటిమేట్ సీన్లు క‌థ‌లో భాగ‌మైతే, చేయ‌క త‌ప్ప‌క‌పోతే కచ్చితంగా చేయాల‌నుకుంటున్నాను. జీ క‌ర్దాలోనూ, ల‌స్ట్ స్టోరీస్‌లోనూ అందుకే చేయ‌గ‌లిగాను. న‌టిగా నాలోని మ‌రో యాంగిల్‌ని ప్రేక్ష‌కుల‌కు ప‌రిచయం చేయాల‌న్న ఉద్దేశంతోనే చేశాను. ఇప్పుడు వాటికి వ‌స్తున్న స్పంద‌న చూస్తే చాలా ఆనందంగా ఉంది. నేను ఎంజాయ్ చేస్తున్నాను" అని అన్నారు.

ల‌స్ట్ స్టోరీస్‌లో త‌మ‌న్నాతో క‌లిసి న‌టించారు విజ‌య్ వ‌ర్మ‌. వీరిద్ద‌రి మ‌ధ్య స‌మ్‌థింగ్ అంటూ చాన్నాళ్లుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. త‌ను ఎక్క‌డుంటే అక్క‌డ హాయిగా ఉంటుంద‌ని త‌మ‌న్నా ఓపెన్ స్టేట్‌మెంట్ ఇచ్చారు.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.