English | Telugu

'కంగువ'తో పాన్ ఇండియా స్టార్ అవుతాడా!

కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా శివ దర్శకత్వంలో రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీకి 'కంగువ' అనే పవర్ ఫుల్ టైటిల్ పెట్టారు. సూర్య కెరీర్ లో 42 వ సినిమాగా తెరకెక్కుతున్న 'కంగువ'ను యూవీ క్రియేషన్స్ తో కలిసి స్టూడియో గ్రీన్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. 3D ఫార్మాట్ లోనూ విడుదల కానున్న ఈ చిత్రం ఏకంగా పది భాషల్లో అలరించనుంది. సూర్య కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి 'కంగువ' అనే టైటిల్ ఖరారు చేసినట్లు తెలుపుతూ తాజాగా ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేశారు.

'కంగువ' టైటిల్ అనౌన్స్ మెంట్ వీడియో ఆకట్టుకుంటుంది. ఆయుధాలతో గుర్రం మీద వెళ్తున్న కథానాయకుడి రూపం, వెనుక భారీ సైన్యంతో గ్రాఫిక్ విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి. టైటిల్ లో గద్దని పోలిన పక్షి రూపం పవర్ ఫుల్ గా ఉంది. ఇక టైటిల్ వీడియోకి దేవి శ్రీ ప్రసాద్ అదిరిపోయే సంగీతం అందించాడు. అలాగే ఈ చిత్రాన్ని 2024 ప్రథమార్థంలో విడుదల చేయబోతున్నట్లు వీడియోలో చూపించారు.

'బాహుబలి'తో పాన్ ఇండియా ట్రెండ్ మొదలయ్యాక తెలుగు హీరోలు, కన్నడ హీరోలు పాన్ ఇండియా రేంజ్ సక్సెస్ లు అందుకొని పాన్ ఇండియా స్టార్స్ గా పేరు తెచ్చుకున్నారు. ఇప్పటి తమిళ హీరోలు మాత్రం ఇంకా పాన్ ఇండియా సక్సెస్ ని టేస్ట్ చూడలేదు. మరి 'కంగువ'తో సూర్య తమిళ్ నుండి మొదటి పాన్ ఇండియా హీరో అనిపించుకుంటాడేమో చూడాలి.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.