English | Telugu

ప్రభాస్‌ స్థాయిని అందుకోవడం మీ వల్ల కాదు.. అర్షద్‌కి కౌంటర్‌ ఇచ్చిన సుధీర్‌బాబు!

ఒకప్పుడు ఇండియాలో బాలీవుడ్‌దే పైచేయిగా ఉండేది. కొందరు బాలీవుడ్‌ స్టార్స్‌, టెక్నీషియన్స్‌ సౌత్‌ ఇండియన్‌ ఫిలిం ఇండస్ట్రీ అంటే చాలా చిన్నచూపుతో ఉండేవారు. అలాంటి పరిస్థితి నుంచి తెలుగువారి కీర్తిని దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి. బాహుబలి సిరీస్‌తో రాజమౌళి, ప్రభాస్‌ వరల్డ్‌వైడ్‌గా ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ని తెచ్చుకున్నారు. ఆ తర్వాత సాహో, సలార్‌, కల్కి వంటి సినిమాలతో ఇండియాలోని ఏ ఇండస్ట్రీ అందుకోలేని స్థాయికి తెలుగు సినిమా చేరింది. ఇది బాలీవుడ్‌లోని కొందరికి మింగుడు పడని వ్యవహారంగా మారింది. అందుకే వీలు చిక్కినప్పుడల్లా తెలుగు నటీనటుల్ని, దర్శకుల్ని కించపరిచే విధంగా మాట్లాడడం, అనవసరమైన వ్యాఖ్యలు చేయడం వారికి అలవాటుగా మారిపోయింది.

ఇటీవల బాలీవుడ్‌ హీరో అర్షద్‌ వార్సి ‘కల్కి’ చిత్రం గురించి ప్రస్తావిస్తూ ప్రభాస్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్‌ తనకు ఓ జోకర్‌లా కనిపించాడని చెబుతూ డార్లింగ్‌ని తక్కువ చేసే ప్రయత్నం చేశాడు. అంతేకాదు, అమితాబ్‌ ముందు ప్రభాస్‌ క్యారెక్టర్‌ తేలిపోయిందని, మ్యాడ్‌మాక్స్‌ తరహాలో అతని క్యారెక్టర్‌ ఉంటుందని తాను ఊహించానని, అలా లేకపోవడంతో చాలా హర్ట్‌ అయ్యానని బాధను నటిస్తూ తన అక్కసును వెళ్ళగక్కాడు. అర్షద్‌ వ్యాఖ్యలపై పలువురు టాలీవుడ్‌ ప్రముఖులు స్పందించినప్పటికీ బాలీవుడ్‌ బాబుల నోళ్ళు మూయించే స్థాయిలో ఎవరూ కౌంటర్‌ ఇవ్వలేకపోతున్నారనే కామెంట్స్‌ కూడా వినిపిస్తున్నాయి. ఆ క్రమంలోనే టాలీవుడ్‌ హీరోగా తాజాగా స్పందిస్తూ ‘నిర్మాణాత్మకంగా విమర్శిస్తే ఎవరైనా ఆహ్వానిస్తారు. కానీ, ఇలా తప్పుగా మాట్లాడడం కరెక్ట్‌ కాదు. వార్సీలో వృత్తి నైపుణ్యం లోపించడం వల్లే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్‌ ఉన్న స్థాయి చాలా పెద్దది. వార్సి అలాంటి కామెంట్స్‌ చేసి ఉండకూడదు’ అని కౌంటర్‌ ఇచ్చారు.

ప్రభాస్‌కి మద్దతుగా ఇప్పటికే అభిషేక్‌ అగర్వాల్‌, సాయికుమార్‌, ఎస్‌కెఎన్‌ వంటి టాలీవుడ్‌ ప్రముఖులు తమ కామెంట్స్‌ను పోస్ట్‌ చేశారు. ఇప్పటివరకు వచ్చిన స్పందనలు సాధారణంగా ఉన్నాయని, దీన్ని సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం ఉందని కొందరు నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. అయితే ప్రభాస్‌గానీ, అతని కుటుంబ సభ్యులుగానీ, అతని సన్నిహితులుగానీ అర్షద్‌ వ్యాఖ్యలపై స్పందించలేదు. తను చేస్తున్న సినిమాలపైనే దృష్టి పెట్టిన ప్రభాస్‌ ఈ కామెంట్స్‌ గురించి పట్టించుకున్నట్టు లేదు. ప్రస్తుతం మారుతి కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘ది రాజా సాబ్‌’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు ప్రభాస్‌. ఇటీవల హను రాఘవపూడి డైరెక్షన్‌లో చేస్తున్న సినిమాను పూజా కార్యక్రమాలతో ప్రారంభించిన విషయం తెలిసిందే.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.