English | Telugu

సీన్ సితారే: నాలుగు నెలల పాటు సినిమాలే సినిమాలు!

ఒక నిర్మాణ సంస్థ నుంచి ఏడాదికి నాలుగైదు సినిమాలు రావడమంటేనే ఓ పెద్ద విషయం. అలాంటిది వరుసగా నాలుగు నెలల పాటు నాలుగుకు మించి చిత్రాలు తెరపైకి రానుండడం.. తెలుగునాట ఆసక్తి రేకెత్తిస్తోంది. ప్రస్తుతం అలా వార్తల్లో నిలుస్తున్న సంస్థ.. సితార ఎంటర్టైన్మెంట్స్. అక్టోబర్ నుంచి జనవరి వరకు ఈ సంస్థ నుంచి వరుసగా సినిమాలు సందడి చేయనున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..

అక్టోబర్: ఈ నెలలో సితార నుంచి మ్యాడ్ చిత్రం రాబోతోంది. ఈ సినిమాతో ఎన్టీఆర్ బావమరిది నితిన్ నార్నే హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడు. బహుశా.. అక్టోబర్ 6న ఈ చిత్రం తెరపైకి వచ్చే అవకాశముంది. ఇక ఇదే నెలలో సితార నుంచి తమిళ అనువాద సినిమా లియో వస్తోంది. విజయ్ హీరోగా నటించిన ఈ మూవీ అక్టోబర్ 19న విడుదల కానుంది. అలాగే, సిద్ధు జొన్నలగడ్డ నటిస్తున్న టిల్లు స్క్వేర్ (డీజే టిల్లు సీక్వెల్) కూడా ఇదే నెలలో జనం ముందుకు వచ్చే అవకాశముంది.

నవంబర్: నవంబర్ నెలలో సితార నుంచి వస్తున్న సినిమా ఆదికేశవ. ఇందులో వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా నటించారు. నవంబర్ 10న దీపావళి కానుకగా ఈ మూవీ ఎంటర్టైన్ చేయనుంది.

డిసెంబర్: డిసెంబర్ మాసంలో ఈ సంస్థ నుంచి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రాబోతోంది. విశ్వక్ సేన్ హీరోగా నటించిన ఈ మూవీ డిసెంబర్ 8న థియేటర్స్ లోకి వస్తోంది.

జనవరి: ఈ నెలలో సితార నుంచి కాదు కానీ ఆ బేనర్ కి అనుబంధ సంస్థ అయిన హారికా అండ్ హాసిని క్రియేషన్స్ నుంచి మూవీ వస్తోంది. ఆ చిత్రమే.. గుంటూరు కారం. సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటిస్తున్న ఈ బిగ్ టికెట్ ఫిల్మ్.. జనవరి 12న తెరపైకి రానుంది.

మరి.. సితార సంస్థ నుంచి తక్కువ కాలంలోనే రానున్న ఈ వరుస చిత్రాలు బాక్సాఫీస్ ముంగిట ఎలాంటి సంచలనం సృష్టిస్తాయో చూడాలి.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.