English | Telugu

మరో కొత్త వివాదంలో ఇరుక్కున్న చిన్మయి!

వివాదాస్పద వ్యాఖ్యలను ఖండించాలన్నా, వివాదాస్పద వ్యాఖ్యలు చేయాలన్నా, తప్పుగా మాట్లాడేవారిని ఏకెయ్యాలన్నా చిన్మయి తర్వాతే ఎవరైనా. సింగర్‌గా, డబ్బింగ్‌ ఆర్టిస్టుగా ఎంత ఫేమస్సో.. వివాదాలతో కూడా అంతే ఫేమస్‌. మహిళలకు ఎదురయ్యే సమస్యలపై పోరాటం చేయడానికి సోషల్‌ మీడియాలో ఎక్కువ దర్శనమిస్తూ ఉంటుంది. తాజాగా ఓ నెటిజన్‌ చున్నీ వివాదానిÊ్న లేవనెత్తాడు. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను షేర్‌ చేశాడు. ఆ వీడియోలో.. ‘ఇప్పుడు ఈ న్యూ ట్రెండ్‌ ఫ్యాషన్‌ అనుకుంటా.. చున్నీ వేసుకోకుండా బయట తిరిగే ప్రతీ అమ్మాయికి.. నాకు అనిపించింది నేను చెప్పుతున్నా. చూసే చూపు మంచిదైతే అన్నీ మంచిగా కనపడతాయని మీరు అనుకోవచ్చు. కానీ, మీరు ఇది గుర్తు పెట్టుకోండి.. బయట ఉండే వాళ్ల అందరి చూపులు ఒకే రకంగా ఉండవు. మీరు వేసుకొనే రూ.100 చున్నీ వల్ల వాళ్ళ నుంచి మీకు.. మీ కుటుంబానికి కొన్ని కోట్ల రూపాయల విలువైన రెస్పెక్ట్‌ దొరుకుతుంది’’ అంటూ పోస్ట్‌ చేశాడు.

దీనిపై చిన్మయి స్పందిస్తూ ‘‘అందరి దగ్గరా ఫోన్‌ ఉంది. అందరి ఫోన్లనో కెమెరా ఉంది. రీమిక్స్‌ చేసుకోవచ్చు. మ్యూజిక్‌ పెట్టుకుని చ.జ.జా అంటూ స్లోమోషన్‌లో.. ఫిల్టర్‌ పెట్టుకుని ఎవరెవరో ఏదెదో చెప్పవచ్చు. ఏమైనా చేయవచ్చు. కానీ, ఈ అబ్బాయిలకి చున్నీ మీద అంత ఇంట్రస్ట్‌ ఎందుకో.. చున్నీ మీద అంత పట్టుదల ఉంటే వాళ్లే కొని వేసుకోవచ్చుగా. అమ్మాయిలూ! చున్నీ కోట్ల రూపాయల రెస్పెక్ట్‌ ఇస్తుంది. ఆ కోట్ల రూపాయలు ఉంటే.. హైదరాబాదులో చాలా విల్లాస్‌ ఉన్నాయి. రెండు ప్రాపర్టీస్‌ కొని.. ఒకటి అద్దెకి ఇచ్చి ఇంకోదానిలో మీరే హాయిగా లైఫ్‌ని గడపండి. దయచేసి ఇలాంటి అబ్బాయిలను డెటింగ్‌ చేయవద్దు, పెళ్లి చేసుకొవద్దు’’ అంటూ సమాధానమిచ్చింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.