English | Telugu

‘రాధికా..’ అంటూ టీజింగ్‌ మొదలు పెట్టిన సిద్ధు!

‘డిజె టిల్లు’.. టాలీవుడ్‌ని షేక్‌ చేసిన సినిమా. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా వచ్చిన ఈ సినిమా యూత్‌ని, మాస్‌ ఆడియన్స్‌నే కాదు, ఫ్యామిలీ ఆడియన్స్‌ని సైతం విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలోని పాటలు బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అయ్యాయి. ఈ సినిమాకి సీక్వెల్‌ రాబోతోంది అనగానే అందరి దృష్టీ పాటలు ఎలా ఉండబోతున్నాయి అనేదానిపైనే ఉంది. ‘టిల్లు స్క్వేర్‌’ పేరుతో రూపొందుతున్న ఈ సినిమాకి సంబంధించి ఆల్రెడీ ఒక పాట రిలీజ్‌ అయి మంచి హిట్‌ అయ్యింది. ఇప్పుడు మరో పాట రాబోతోంది. నవంబర్‌ 27 సాయంత్రం 4.05 గంటలకు ‘రాధిక..’ అనే ఒక డాన్స్‌ నంబర్‌ని విడుదల చేయబోతున్నారు. ఈ విషయాన్ని అఫీషియల్‌గా ఎనౌన్స్‌ చేస్తూ ఆ పాటకు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. రామ్‌ మిర్యాల మ్యూజిక్‌ అందించడమే కాదు, అద్భుతంగా గానం చేశాడు. నిర్మాణ పరంగా ఆలస్యం జరుగుతున్నప్పటికీ మంచి కంటెంట్‌తో, పక్కా సూపర్‌హిట్‌ అవుతుందన్న కాన్ఫిడెన్స్‌తో యూనిట్‌ వర్క్‌ చేస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 9న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. మల్లిక్‌ రామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.