English | Telugu

కార్తీ "శకుని" టీజర్, లోగో రిలీజ్

కార్తీ "శకుని" టీజర్, లోగో రిలీజ్ జరిగింది. వివరాల్లోకి వెళితే కె.ఇ.జ్ఞానవేల్ రాజా సమర్పణలో,స్టుడియో గ్రీన్ పతాకంపై, కార్తీ హీరోగా, ప్రణీత హీరోయిన్ గా, యన్.శకర్ దయాళ్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ, కె.ఇ.జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ద్విభాషాచిత్రం "శకుని". సెప్టెంబర్ రెండవ తేదీన, హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో, ఈ "శకుని" టీజర్ ని ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ విడుదల చేయగా, లోగోని మూవీ మొగల్ డాక్టర్, డి.రామా నాయుడు విడుదల చేశారు. ఈ సూర్య సోదరుడైన ఈ చిత్ర కథానాయకుడు కార్తీ "యుగానికొక్కడు", "ఆవారా", "నాపేరే శివ" చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే.

హీరోయిన్ ప్రణీత తెలుగులో "బావ" చిత్రంలో నటించింది. దర్శకుడు శకర్ దయాళ్ "దిల్ సినిమాకు వినాయక్ వద్ద అసిస్టెంట్ గా పనిచేశారు. త్వరలో విడుదల కాబోతున్న ఈ "శకుని" చిత్రానికి "ఉల్లాసంగా-ఉత్సాహంగా", "డార్లింగ్", "యుగానికొక్కడు", "నాన్న" చిత్రాల ఫేం జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ "శకుని" చిత్రానికి మాటలు శశాంక్ వెన్నెలకంటి, పాటలు సాహితి వ్రాయగా, ఎడిటింగ్ శ్రీకర ప్రసాద్, సినిమాటోగ్రఫీ "శంభో శివ శంభో" ఫేం పి.జి.ముత్తయ్య నిర్వహిస్తున్నారు. ఈ "శకుని" చిత్రానికి యస్.ఆర్.ప్రకాష్, యస్.ఆర్.ప్రభు సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.