English | Telugu

సారంగదరియా.. చాలా రోజులకు ఓ మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్!

ప్రేక్షకులకు బాగా చేరువైన పాటలోని లైన్ ని టైటిల్ గా పెట్టుకొని హిట్ కొట్టిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు ఆ లిస్టులోకి చేరడానికి మరో చిత్రం ప్రయత్నిస్తోంది. రాజా రవీంద్ర ప్రధాన పాత్రలో సాయిజా క్రియేషన్స్ పతాకంపై ఉమాదేవి, శరత్ చంద్ర నిర్మాతలుగా పద్మారావు అబ్బిశెట్టి(అలియాస్ పండు) దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం 'సారంగదరియా'.

ఈ మూవీ టైటిల్ పోస్టర్ తాజాగా యంగ్ హీరో రాజ్ తరుణ్ చేతులమీదుగా విడుదలైంది. ఈ సందర్బంగా రాజ్ తరుణ్ మాట్లాడుతూ.. "సారంగదరియా ఫస్ట్ లుక్ పోస్టర్ నేను విడుదల చెయ్యడం చాలా సంతోషంగా ఉంది. పోస్టర్ అండ్ టైటిల్ చూడగానే పాజిటివ్ గా చాలా బాగుంది అనిపించింది. ఫ్యామిలీ చిత్రం గా త్వరలో విడుదల కానున్న సారంగదరియా.. ప్రధాన పాత్రలో నటిస్తున్న మా రాజా రవీంద్ర అన్నకి, ప్రొడ్యూసర్స్ శరత్ చంద్ర గారికి ఉమాదేవి గారికి, ఈ చిత్రం తో డైరెక్టర్ గా పరిచయం అవుతున్న పద్మారావుకి మంచి విజయాన్ని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అన్నారు.

ప్రొడ్యూసర్ శరత్ చంద్ర మాట్లాడుతూ.. "మా ఫస్ట్ లుక్ టైటిల్ పోస్టర్ అడిగిన వెంటనే విడుదల చేసిన హీరో రాజ్ తరుణ్ గారికి చాలా థాంక్స్. త్వరలో మూవీ విడుదలకి సన్నాహాలు చేస్తున్నాము. మా సారంగదరియా అందరికీ నచ్చేలా ఉంటుంది" అన్నారు.

డైరెక్టర్ పద్మారావు అబ్బిశెట్టి(పండు )మాట్లాడుతూ.. "నేను సారంగదరియాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్స్ ఉమాదేవి గారికి,శరత్ చంద్ర గారికి ధన్యవాదాలు. ఈ రోజు మా మూవీ పోస్టర్ విడుదల చేసిన హీరో రాజ్ తరుణ్ గారికి థాంక్యూ. చిత్రం ఇంత బాగా రావడానికి సపోర్ట్ చేసిన రాజా రవీంద్ర గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఈ సినిమా ఒక మధ్యతరగతి ఫ్యామిలీ లో జరిగిన కొన్ని ఘర్షణలతో కథ ఉంటుంది." అన్నారు.

శ్రీకాంత్ అయ్యంగార్, శివ చందు, యశస్విని తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఎం. ఎబెనెజర్ పాల్ సంగీతం అందిస్తుండగా.. సినిమాటోగ్రాఫర్ గా సిద్ధార్థ స్వయంభు, ఎడిటర్ గా రాకేష్ రెడ్డి వ్యవహరిస్తున్నారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.