English | Telugu

స‌మంత స్టంట్‌... ఆశ్చ‌ర్య‌పోతున్న నెటిజ‌న్స్‌

సౌతిండియ‌న్ ఆడియెన్స్‌కి ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. సినిమాలైనా, వ్య‌క్తిగ‌త విష‌య‌మైనా సామ్‌పై మీడియా క‌న్ను ఎప్పుడూ ఉంటుంది. 2010లో సినీ రంగ ప్ర‌వేశం చేసిన ఈ చెన్నై సొగ‌స‌రి ఎప్పుడూ లేని విధంగా తొలిసారి త‌న యాక్టింగ్ కెరీర్‌లో బ్రేక్ తీసుకుంది. అది కూడా ఏకంగా ఏడాది పాటు. ఇంత బ్రేక్ తీసుకోవ‌టం అనేది హీరోల‌కు చెల్లుబాటు అవుతుందేమో కానీ హీరోయిన్స్‌కి కాదు. కానీ స‌మంత మాత్రం వీటిని ప‌ట్టించుకోకుండా బ్రేక్ తీసుకుంది. అందుకు ఆమెకు కార‌ణాలున్నాయి. గ‌త కొంత‌కాలంగా ఆమె మ‌యోసైటిస్‌తో బాధ‌ప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. నిజానికి ఆమె ఇక సినిమాలు చేయ‌లేదేమో అని అనుకున్నారందరూ అయితే ఆమె క‌ఠోరంగా క‌ష్ట‌ప‌డి రిట‌ర్న్ బ్యాక్ అయ్యింది. సిటాడెల్ సిరీస్‌తో పాటు విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో ఖుషి సినిమాను పూర్తి చేసేసింది.

ప్ర‌స్తుతం కొత్త సినిమాల‌ను సెట్స్ పైకి తీసుకెళ్ల‌కుండా బ్రేక్ తీసుకుంది. సినిమాల‌కు దూరంగా ఉంటున్నప్ప‌టికీ సోష‌ల్ మీడియాలో ఎప్పటిక‌ప్పుడు అప్‌డేట్స్ ఇస్తోంది. కొన్నాళ్ల పాటు ఆధ్యాత్మిక చింత‌న‌లో ఉన్న స‌మంత, బాలిలో స్నేహితుల‌తో క‌లిసి వెకేష‌న్‌ను ఎంజాయ్ చేసింది. జిమ్‌లో ఎక్కువ సేపు క‌ష్ట‌పడుతుంది. రీసెంట్‌గా సామ్ జిమ్ వీడియో బ‌య‌ట‌కు వ‌చ్చింది. అది కూడా నెటిజ‌న్స్ వావ్ అనేస్తున్నారు. అందుకు కార‌ణం.. ఆమె చేసిన ఆక్రో స్టంట్‌. అంటే కాలిపై మ‌రో వ్య‌క్తి బ‌రువును బ్యాలెన్స్ చేయ‌టం. దీన్ని రెగ్యుల‌ర్‌గా జిమ్నాస్టిక్స్ చేస్తూ వ్యాయామం చేసేవాళ్లు మాత్రమే చేయ‌గ‌ల‌రు. అయితే స‌మంత ఈ స్టంట్ చేయ‌టంపై అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోతున్నారు.

ఇక స‌మంత సినిమాల విష‌యానికి వస్తే విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో ఆమె చేసిన ఖుషి సినిమా సెప్టెంబ‌ర్ 1న రిలీజ్ అవుతుంది. మరో వైపు సిటాడెల్ సిరీస్ ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌టానికి సిద్ధ‌మ‌వుతోంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.