English | Telugu

గిల్లిక‌జ్జాలు పెట్టుకొంటున్న మ‌హేష్ హీరోయిన్లు



క‌థ‌.. అందులో నా పాత్ర న‌చ్చితే చాలు.. మా స్థానం ఏంట‌న్న‌ది అడ‌గం... అంటుంటారు క‌థానాయిక‌లు. అయితే ఇలాంటి మాట‌లు చెప్పుకోవ‌డానికి బాగుంటాయి. వాస్త‌వంలో మాత్రం ఆ స్థానం కోస‌మే గిల్లికజ్జాలు మొద‌ల‌వుతాయి. ఇప్పుడు స‌మంత‌, కాజ‌ల్ మ‌ధ్య అదే జ‌రుగుతోంది. వీరిద్ద‌రూ బ్ర‌హ్మోత్స‌వంలో మ‌హేష్ బాబు స‌ర‌స‌న న‌టిస్తున్నారు. ఇందులో మూడో నాయిక ప్ర‌ణీత కూడా ఉంది. ప్ర‌ణీత అన‌గానే ఎలాగూ `సెకండ్ హీరోయిన్‌` అనే ముద్ర ప‌డిపోయింది. ఈ సినిమాతో `మూడోనాయిక‌` కి ప‌డిపోయింది.

ఇప్పుడు స‌మ‌స్యల్లా తొలి స్థానం ఎవ‌రిద‌నే. ఫామ్‌ని బ‌ట్టి చూస్తే స‌మంత‌కు, సీనియార్టిని బ‌ట్టి చూస్తే కాజ‌ల్‌కి ఫ‌స్ట్ ప్లేస్ ఇవ్వాలి. ఈ విష‌యంలోనే ఈ క‌థానాయిక‌లిద్ద‌రూ ద‌ర్శ‌కుడికి నిద్ర లేకుండా చేస్తున్నార్ట‌. `ఈ సినిమాలో నేనే క‌దా ఫ‌స్ట్ హీరోయిన్ ` అంటూ అటు కాజ‌ల్‌, ఇటు స‌మంత ఫోన్లు చేసి మ‌రీ విసిగిస్తున్నార‌ట‌. `మీ ఇద్ద‌రి పాత్ర‌లూ స‌మానంగానే ఉంటాయి` అని చెబుతున్నా... `ప్ర‌మోష‌న్ల‌లో నాకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి` అంటూ కండీష‌న్లు పెడుతున్నార్ట‌.

సినిమాలో ముగ్గురు క‌థానాయిక‌లుంటే ఎవ్వ‌రికీ ప్రాధాన్యం ఉండ‌ద‌న్న భ‌యం హీరోయిన్ల‌ది. అందుకే కాజ‌ల్‌, స‌మంత తెగ హైరానా ప‌డిపోతున్నారు. మ‌రి వీరిద్ద‌రి భ‌యాన్ని ద‌ర్శ‌కుడు శ్రీ‌కాంత్ అడ్డాల ఎలా పోగొడ‌తాడో చూడాలి.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.