English | Telugu

ఆ ప్ర‌శ్న విని.. రెచ్చిపోయిన రాజ‌మౌళి



రాజ‌మౌళిని ఎప్పుడు చూసినా ప్ర‌శాంతంగా క‌నిపిస్తాడు. మీడియా ముందు... ఆయ‌నెప్పుడూ కంట్రోల్ త‌ప్ప‌లేదు. ఏ ప్ర‌శ్న అడిగినా ఓర్పుతో స‌మాధానం చెబుతాడు. అయితే ఓ ఇంట‌ర్వ్యూలో ఓ ప్ర‌శ్న‌విని రాజ‌మౌళి రెచ్చిపోయాడ‌ట‌. `నాన్సెన్స్‌...ఇలాంటి ప్ర‌శ్న‌లు నా ద‌గ్గ‌ర అడుగుతారా?` అంటూ మైకు విసిరికొట్టి.. అక్క‌డి నుంచి వెళ్లిపోయాడ‌ట‌.

`బాహుబ‌లి` ప్ర‌మోష‌న్లు మ‌హా జోరుగా సాగుతున్న సంగ‌తి తెలిసిందే. టీవీ ఛాన‌ళ్ల‌కు రికార్డెడ్ ఇంట‌ర్వ్యూలు ఇస్తూ వ‌స్తున్నాడు రాజ‌మౌళి. ఓ టీవీ ఛాన‌ల్ రాజ‌మౌళిని ఇంట‌ర్వ్యూ చేస్తూ చేస్తూ... ఓ అభ్యంత‌ర‌క‌ర‌మైన ప్ర‌శ్న అడిగిన‌ట్టు స‌మాచారం. ఆ ప్ర‌శ్న కూడా ప్ర‌భాస్‌ని ఉద్దేశించే. ఆమ‌ధ్య ప్ర‌భాస్ వ్య‌వ‌హారంలో ఓ రాజ‌కీయ నాయ‌కురాలితో ముడిపెట్టి వేడి వేడి క‌థ‌నాలు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అందుకు సంబంధించిన ప్ర‌శ్న రాజ‌మౌళిని అడిగార‌ట‌. దాంతో రాజ‌మౌళికి కోపం వ‌చ్చేసింద‌ట‌.

`ఇలాంటి ప్ర‌శ్న‌లు న‌న్ను అడ‌గుతారా` అంటూ అలిగి.. ఆ ఇంటర్వ్యూని అక్క‌డితో ముగించి వెళ్లిపోయిన‌ట్టు తెలుస్తోంది. ఇలాంటి సున్నిత‌మైన విష‌యాల్లో స్పందించ‌డం ఎవ‌రికైనా.. ఇబ్బందే మ‌రి! మొత్తానికి రాజ‌మౌళి కోపం ఎలా ఉంటుందో స‌ర‌దు మీడియా వారికి ప్ర‌త్య‌క్షంగా తెలిసొచ్చిన‌ట్టైంది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.