English | Telugu

చెర్రీతో ఉన్న రిలేషన్ గురించి చెప్పిన సదా!

'జయం' మూవీలో "వెళ్ళవయ్యా వెళ్ళు" అంటూ నితిన్ తో జతకట్టి ఆ ఒక్క డైలాగ్ తో ఆడియన్స్ మనసులను కొల్లగొట్టిన బ్యూటీ సదా. ఈమె కెరీర్ లో గుర్తుంచుకోదగ్గ మూవీ ఏదైనా ఉంది అంటే అది 'అపరిచితుడు' మాత్రమే. ఆ తర్వాత చాలా మూవీస్ లో హీరోయిన్ నటించింది గానీ పెద్దగా క్లిక్ కాలేదు. అలాంటి సదా ఢీ, బీబీ జోడి లాంటి డ్యాన్స్ షోలకు జడ్జిగా చేసింది. ఇప్పుడు నీతోనే డాన్స్ షోకి జడ్జిగా వ్యవహరిస్తోంది. ఆమె సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ఎన్నో వెరైటీ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు తాను ఇంట్లో పెంచుకునే పిల్లి తన నుదురును నాకుతూ ఉన్న ఒక వీడియోని పోస్ట్ చేసింది.

"లాక్డౌన్ టైములో నేను రక్షించిన ఈ పిల్లి పేరు చెర్రీ. దానికి అప్పటికే 8 సంవత్సరాల వయస్సు. అప్పటికి దాని మెడ మీద ఒక పెద్ద గాయంతో బాధపడుతోంది. అలాగే ఆస్తమాతో బాధపడుతోంది. దాన్ని ఇంటికి తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేయించాను. ఐతే అది కోలుకున్న తర్వాత నేను దాన్ని బయట వదిలిపెట్టలేదు. అలా అప్పటి నుంచి నాతోనే ఉండిపోయింది. పిల్లుల్లో ఎక్కువగా గమనిస్తే తమ ప్రేమను, అఫెక్షన్ ని చూపించేటప్పుడు ఇలాగే నాకుతూ ఉంటాయి. వాటికి పుట్టిన పిల్లలినైనా కూడా ఇలాగే చేస్తూ ఉంటాయి. వాటి ప్రేమను చూపించుకోవడానికి ఎంచుకున్న మార్గం ఇదే. మనం పెంచుకునే జంతువులు జీవితాల్లోకి ఎంత ప్రేమను తీసుకువస్తాయో చెప్పడానికి మాత్రమే ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాను. నా మీద చూపించే ప్రేమ ఇది...వాటిని ఇష్టమొచ్చినట్టు పిలవడం అలాగే ఇలాంటి పిల్లుల్ని పట్టించుకోకుండా జాతి పిల్లుల్ని కొనుక్కోవడం చాలా తప్పు" అని తన చెర్రీతో ఉన్న రిలేషన్ గురించి చెప్పారు సదా.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.