English | Telugu

ఇప్పటివరకు నేను చూసిన పికె ట్రైలర్స్‌లో ‘ఒజి’ ది బెస్ట్‌  - ఆర్‌జివి

తన ట్విట్టర్‌ పోస్టుల ద్వారా వార్తల్లో నిలిచే డైరెక్టర్‌ రామ్‌గోపాల్‌వర్మ. ఏదైనా ఘటనకు స్పందించాలనుకుంటే ట్విట్టర్‌ను వేదికగా చేసుకునే వర్మ.. పవన్‌కల్యాణ్‌ పుట్టినరోజు సందర్భంగా మరోసారి వార్తల్లోకి వచ్చాడు. పవన్‌కళ్యాణ్‌ పుట్టినరోజు సందర్భంగా అతని కొత్త సినిమా ‘ఒజి’ గ్లింప్స్‌ రిలీజ్‌ సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తున్న విషయం తెలిసిందే. పవన్‌కళ్యాణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి, ‘ఒజి’ గ్లింప్స్‌పై రామ్‌గోపాల్‌వర్మ స్పందిస్తూ ‘ఒజి గ్లింప్స్‌ ప్రపంచాన్ని దాటేసిందది. నేను ఇప్పటివరకు చూసిన పికె ట్రైలర్స్‌లో ఇది అత్యుత్తమం. హే సుజిత్‌ మీరు చంపేశారు బ్రో’ అంటూ ట్వీట్‌ చేశారు. పవన్‌కల్యాణ్‌ విషయంలో ఎక్కువగా నెగెటివ్‌గానే స్పందించే వర్మ ఈసారి ఎంతో పాజిటివ్‌ అప్రిషియేట్‌ చెయ్యడంతో నెటిజన్లు, ఫ్యాన్స్‌ షాక్‌ అవుతున్నారు. ఇది ఎవ్వరూ ఊహించని ట్వీట్‌ అంటున్నారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.