English | Telugu

రజినీకాంత్ 171... డైరెక్టర్ ఫిక్స్ అయినట్లే!

సూపర్ స్టార్ రజినీకాంత్ మాస్ రేంజ్ ఎలా ఉంటుందో రీసెంట్ గా వచ్చిన జైలర్ సినిమా రుజువు చేసింది. ఈ సినిమా ఏకంగా రూ. 600 కోట్ల వసూళ్లను సాధించటం విశేషం. ఈ సినిమా తర్వాత తలైవర్ ఏకంగా రెండు సినిమాలతో అలరించబోతున్నారు. అందులో ఒకటి 'లాల్ సలాం' కాగా మరో చిత్రాన్ని 'జై భీమ్' ఫేమ్ టి.జె.జ్ఞానవేల్ దర్శకత్వంలో చేయబోతున్నారు. కాగా.. ఇప్పుడు రజినీకాంత్ తో 'జైలర్' సినిమా చేసిన సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ ఆయనతో మరో సినిమాను చేయడానికి రెడీ అయిపోయారు. రీసెంట్ గా తలైవర్ ను కలిసిన నేపథ్యంలో తమ బ్యానర్ లోనే తలైవర్ 171ను చేయాలని కోరారు. ఇంతకీ ఈ సినిమాను ఎవరు డైరెక్ట్ చేయబోతున్నారో తెలుసా!.. లోకేష్ కనకరాజ్. మాస్ హీరోలను నెక్ట్స్ రేంజ్ లో చూపిస్తూ వరుస విజయాలను సాధిస్తోన్న లోకేష్ దర్శకత్వంలో రజినీకాంత్ సినిమా ఉంటుంది. వీరిద్దరి కాంబోలో సినిమా అధికారికంగా అనౌన్స్ అయితే అంచనాలు ఎలా ఉంటాయనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ప్రస్తుతానికి రజినీకాంత్ తన 170వ సినిమాను జ్ఞానవేల్ దర్శకత్వంలో చేయబోతున్నారు. ఇందులో బిగ్ బి అమితాబ్ బచ్చన్, టాలీవుడ్ నుంచి శర్వానంద్ కూడా నటిస్తున్నారు. ఇందులో ఫేక్ ఎన్ కౌంటర్స్ కి వ్యతిరేకంగా పోరాటం చేసే రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ గా సూపర్ స్టార్ కనిపించబోతున్నారు. దీని తర్వాత లోకేష్ కనకరాజ్ మూవీ ఉంటుంది. ఈ దసరాకు అక్టోబర్ 19న లియో సినిమాతో లొకేష్ సందడి చేయబోతున్నారు. ఇందులో దళపతి విజయ్ హీరోగా నటిస్తున్నారు. త్రిష హీరోయిన్.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.