English | Telugu

'బహుబలి' ఓవర్ సీస్ రైట్స్ అన్ని కోట్లా..?

టాలీవుడ్ మొత్తం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న చిత్రం 'బహుబలి'. ప్రముఖ దర్శకుడు రాజమౌళి భారీ స్ధాయిలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇందులో ప్రభాస్ హీరోగా నటిస్తుండగా.. దగ్గుబాటి రాణా ముఖ్య భూమిక పోషిస్తున్నారు. అనుష్క, తమన్నా హీరోయిన్లు. ఈ చిత్రానికి సంబంధించిన ఓవర్ సీస్ రైట్స్‌ని బ్లూ స్కై వారు 9 కోట్లు వెచ్చించి సొంతం చేసుకున్నారని సమాచారం. ఈ 9 కోట్లు తొలి భాగానికే మాత్రమేనట. ఈ మేరకు అగ్రిమెంట్ జరిగిందని తెలుస్తోంది.

ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్ద ఆర్కా మీడియా సంస్ద నిర్మిస్తోంది. కె. రాఘవేంద్రరావు సమర్పకులు. ఈ సినిమాని తెలుగు, తమిళంలో ఒకేసారి తెరకెక్కిస్తున్నారు. ఆ తర్వాత ఇతర భాషల్లోకి అనువదించి ఒకేసారి విడుదల చేయనున్నారు. ఈ సినిమా కోసం ఇందులో నటిస్తున్న తారాగణం అంతా కత్తి యుద్దం, గుర్రపు స్వారీ నేర్చుకున్నారు. ఈ చిత్రంలో ప్రతిదీ సంచనలమే. షూటింగ్ మొదలైనప్పటి నుండి రోజుకో వార్తతో కొత్త కొత్త రికార్డులను సృష్టిస్తుంది. ఐమాక్స్ ఫార్మాట్‌లో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.

ఒకప్పటి స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణ నెగిటివ్ రోల్‌లో కనిపించనుంది. అన్నదమ్ములుగా రాణా, ప్రభాస్‌లు కనిపిస్తారు. వీరిద్దరి మధ్య రాజ్యం కోసం జరిగే కుట్రలతో ఈ చిత్రం సాగుతుంది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.