English | Telugu

ఇలాఖా మనదే.. తడాఖా మనదే : వరల్డ్‌ కప్‌ లైవ్‌లో రవితేజ

మాస్‌ మహారాజా రవితేజ హీరోగా వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న విభిన్న చిత్రం ‘టైగర్‌ నాగేశ్వరరావు’. ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్‌ 20న విడుదల చేయనున్నారు. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్‌ స్టార్ట్‌ చేశారు.

ప్రస్తుతం దేశమంతా వరల్డ్‌ కప్‌ ఫీవర్‌తో ఉంది. ఇందులో ప్రతి మ్యాచ్‌ ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. అందులోనూ ఇండియా మ్యాచ్‌ అంటే వేరే చెప్పక్కర్లేదు. అక్టోబర్‌ 8న ఇండియా తొలి మ్యాచ్‌ ఆడబోతోంది. చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్థాన్‌తో ఇండియా మ్యాచ్‌ అంటే మామూలుగా ఉండదు. టైగర్‌ నాగేశ్వరరావు ప్రమోషన్స్‌లో భాగంగా అక్టోబర్‌ 8న జరిగే ఇండియా.. పాకిస్తాన్‌ మ్యాచ్‌ లైవ్‌లోకి ‘ఇలాఖా మనదే.. తడాఖా మనదే’ అంటూ రవితేజ ఎంటర్‌ అవుతున్నాడు. తమ ఛానల్‌లో ప్రసారమయ్యే క్రికెట్‌ లైవ్‌లో రవితేజ పాల్గొంటున్నాడని స్టార్‌ స్పోర్ట్స్‌ తెలుగు చానల్‌ వెల్లడిరచింది. దీనికి సంబంధించిన ప్రోమోను కూడా విడుదల చేసింది. అక్టోబర్‌ 8 మధ్యాహ్నం గం 12.30లకు రవితేజ లైవ్‌ కార్యక్రమం ఉంటుందట. అంటే మ్యాచ్‌ ప్రారంభానికి ముందు రవితేజ లైవ్‌లోకి వస్తాడన్నమాట.

దాదాపు 50 సంవత్సరాల క్రితం పలు రాష్ట్రాల పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన స్టూవర్ట్‌పురం గజదొంగ నాగేశ్వరరావు జీవిత కథను బేస్‌ చేసుకొని ‘టైగర్‌ నాగేశ్వరరావు సినిమా రూపొందింది. స్టూవర్ట్‌పురం నాగేశ్వరరావు.. టైగర్‌ నాగేశ్వరరావుగా ఎలా మారాడు అనేది ఈ సినిమా కథ. ఇప్పటివరకు రిలీజ్‌ అయిన టీజర్‌, ట్రైలర్స్‌ అందర్నీ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాకి పాజిటివ్‌ వైబ్రేషన్స్‌ ఉండడంతో రవితేజ ఈసారి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.