English | Telugu

ప్రభాస్ తో సంథింగ్ స్పెషల్.. మహేష్ గురించి ఆ సీక్రెట్..!

పుష్ప, యానిమల్, ఛావా వంటి సినిమాలతో పాన్ ఇండియా వైడ్ గా మంచి గుర్తింపు సొంతం చేసుకుంది రష్మిక మందన్న. ప్రస్తుతం ఆమె చేతిలో పలు క్రేజీ ప్రాజెక్ట్ లు ఉన్నాయి. ఈ నవంబర్ 7న 'ది గర్ల్‌ఫ్రెండ్‌'తో ప్రేక్షకులను పలకరించనుంది. ఈ మూవీ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్న రష్మిక.. తాజాగా అభిమానులతో సోషల్ మీడియా వేదికగా చిట్ చాట్ నిర్వహించింది. ఇందులో భాగంగా స్టార్ హీరోలు ప్రభాస్, మహేష్ బాబుపై ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. (Rashmika Mandanna)

ప్రజెంట్ టాలీవుడ్ టాప్ స్టార్స్ లో మహేష్ బాబు, అల్లు అర్జున్ తో స్క్రీన్ షేర్ చేసుకున్న రష్మిక.. ఇంకా ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ వంటి స్టార్స్ తో కలిసి నటించలేదు. ఈ క్రమంలోనే ఓ అభిమాని ప్రభాస్ తో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశముందా? అని అడిగాడు.

"ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ తో కలిసి వర్క్ చేసే అవకాశముందా. ఒకవేళ అది జరిగితే థియేటర్ దగ్గర నా బాడీ కలెక్ట్ చేసుకో రషు" అంటూ హైప్ తో చనిపోయినట్టుగా ఉన్న బ్రహ్మానందం ఫొటో మీమ్ ని ప్రభాస్ అభిమాని పోస్ట్ చేశాడు. దీనికి రష్మిక ఇచ్చిన సమాధానం వైరల్ అవుతోంది. "ఇది నాకు నచ్చింది. ప్రభాస్ సర్ ఈ మెసేజ్ చూస్తారని ఆశిస్తున్నాను. అలాగే, మేమిద్దరం త్వరలో ఒక ప్రత్యేకమైన ప్రాజెక్ట్‌లో కలిసి పనిచేస్తామని కూడా ఆశిస్తున్నాను" అని రష్మిక రాసుకొచ్చింది.

Also Read: ప్రభాస్ 'ఫౌజీ' సర్ ప్రైజ్.. బిగ్ లీక్ ఇచ్చిన సుధీర్ బాబు!

"మహేష్ బాబులో మీకు నచ్చిన ఒక విషయం ఏమిటి?" అని ఓ అభిమాని అడగగా.. దానికి కూడా రష్మిక భలే సమాధానం ఇచ్చింది. "సర్ ఎప్పటికీ యంగ్ గా కనిపిస్తారు. అసలు వయసు అయిపోదు. ఇంకా వయసు వెనక్కి తగ్గుతున్నట్టు అనిపిస్తుంది. నాకు అది చాలా ఇష్టం. అసలది ఎలా సాధ్యమో తెలుసుకోవాలనుకుంటున్నాను." అని రష్మిక రిప్లై ఇచ్చింది.

ప్రభాస్, మహేష్ గురించి రష్మిక చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .