English | Telugu

బాహుబలికి రామోజీ ప్రశంసలు

"బాహుబలి" చిత్ర షూటింగ్ సమయంలోనే అరుదైన ప్రశంసలను అందుకుంటుంది. అత్యధిక భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ప్రభాస్ ,రానా అన్నదమ్ములుగా నటిస్తున్న ఈ చిత్రంలో అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తుంది. అయితే రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ చిత్రానికి సంబంధించిన ఓ భారీ సెట్ ను ఆర్ట్ డైరెక్టర్ సింబు సిరల్ అద్వర్యంలో వేశారు. ఈ సెట్ ను ఇటీవలే రామోజీరావు చూసారు. ఈ సెట్ తనకు ఎంతగానో నచ్చడంతో.. ఇలాంటి సెట్ మా ఫిల్మ్ సిటీలో వేసినందుకు చాలా సంతోషంగా ఉందని, సింబు సిరెల్ పనితనం బాగుందని రాజమౌళి, సింబు సిరెల్ లను మెచ్చుకుంటూ ఓ లేఖను రాశారు. ఈ లేఖతో రాజమౌళి చాలా ఆనందంగా ఉన్నాడు. రామోజీ గారి దగ్గర నుండి ఇలాంటి ప్రశంస అందుకున్నరాజమౌళికి 100 అవార్డులతో సమానం అని ఫేస్ బుక్ ద్వారా తన ఆనందాన్ని పంచుకున్నాడు రాజమౌళి.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .