English | Telugu
రామ్, నాగ్ పైనే ఆశలు.. ఫెస్టివల్స్ ప్లస్ అయ్యేనా?
Updated : Aug 29, 2023
కొందరి ప్రయత్నాలు ఎంతో ప్రామిసింగ్ గా అనిపిస్తాయి. కాకపోతే, రిజల్ట్స్ మాత్రం తేడా కొట్టేస్తుంటాయి. సరిగ్గా.. ఇలాంటి పరిస్థితే ఓ నిర్మాతది కూడా. ఇప్పటివరకు అతను నిర్మించిన సినిమాలన్నీ క్రేజీగా ఉన్నవే. ఎటొచ్చిసాలిడ్ హిట్ మాత్రం దక్కలేదు. ఇంతకీ ఆ నిర్మాత ఎవరంటే.. శ్రీనివాస చిట్టూరి.
శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై ఆయన ఇప్పటివరకు యుటర్న్ (2018), సీటీమార్ (2021), ది వారియర్ (2022), కస్టడీ (2023) వంటి సినిమాలు నిర్మించారు. వీటిలో సమంత నటించిన యుటర్న్, గోపీచంద్ స్టారర్ సీటీమార్ యావరేజ్ గా నిలవగా.. ది వారియర్, కస్టడీ మాత్రం డిజాస్టర్స్ గా నిలిచాయి. ఈ నేపథ్యంలో.. రానున్న స్కంద, నా సామి రంగపైనే ఆశలు పెట్టుకున్నారాయన.
ది వారియర్ తరువాత రామ్ పోతినేని కాంబినేషన్ లో శ్రీనివాస చిట్టూరి నిర్మించిన స్కంద వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 15న రానుంది. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇక నాగార్జునతో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ నిర్మిస్తున్న నా సామి రంగ 2024 సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఈ సినిమాతో కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. మరి.. ఫెస్టివల్ స్సెషల్స్ గా రాబోతున్న స్కంద, నా సామి రంగ.. శ్రీనివాస చిట్టూరి ప్రయత్నానికి, పట్టుదలకి తగ్గ ఘన విజయాలను అందిస్తాయో చూడాలి.