English | Telugu

ట్రాప్‌లో ప‌డొద్దు.. వ‌రుణ్ తేజ్‌కి రామ్ చ‌ర‌ణ్ స‌ల‌హా

మెగా హీరోల్లో ఇప్పుడు రామ్ చ‌ర‌ణ్ పాన్ ఇండియా హీరో ఇమేజ్‌ను సంపాదించుకున్నారు. భారీ బ‌డ్జెట్ సినిమాల‌నే చేస్తూ వస్తున్నారు. సినిమాల‌నే కాదు.. ఫ్యామిలీ విష‌యాల్లో చ‌ర‌ణ్ త‌న వారికి మంచి స‌ల‌హాల‌నే ఇస్తున్నారు. ఈ విష‌యం చెప్పింది ఎవ‌రో కాదు.. హీరో వ‌రుణ్ తేజ్‌. త‌న‌కు అన్న‌య్య రామ్ చ‌ర‌ణ్ కెరీర్ ప‌రంగా ఓ స‌ల‌హాను ఇచ్చార‌ని, ఇప్పుడు ఆ స‌ల‌హానే తాను పాటిస్తున్నాన‌ని అంటున్నారు వ‌రుణ్ తేజ్‌. ఇంత‌కీ త‌మ్ముడుకి మెగా ప‌వ‌ర్ స్టార్ ఇచ్చిన స‌ల‌హా ఏంట‌నే వివ‌రాల్లోకి వెళితే..

రామ్ చ‌ర‌ణ్‌తో ఉన్న అనుబంధం గురించి వ‌రుణ్ తేజ్ ఓ సంద‌ర్భంలో మాట్లాడుతూ ‘‘నా ఏడ‌వ సినిమా త‌ర్వాత రామ్ చ‌ర‌ణ్ అన్న‌య్య‌ను క‌లిశాను. అప్పుడాయ‌న యూనిక్ స్క్రిప్ట్స్‌ను సెల‌క్ట్ చేసుకో అన్నారు. నీ చుట్టూ ఉండేవాళ్లు మార్కెట్ పోతుంద‌ని చాలా స‌ల‌హాలు ఇస్తారు. దాని వ‌ల్ల ప్ర‌యోగాలు చేయ‌టానికి ఆలోచ‌న‌లో ప‌డతావు. కాబ‌ట్టి అలాంటి ట్రాప్‌లో ప‌డొద్దు’’ అన్నారు.

వ‌రుణ్ తేజ్ ఇప్పుడు యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ గాండీవ‌ధారి అర్జున చిత్రంతో సంద‌డి చేయ‌బోతున్నారు. ఈ సినిమా ఆగ‌స్ట్ 25న రిలీజ్ కానుంది. ఇందులో గ్లోబ‌ల్ వార్మింగ్‌కు సంబంధించిన మెసేజ్‌ను కూడా ఇస్తున్నారు. ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాను బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ నిర్మించారు. సాక్షి వైద్య హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ ఏడాదిలోనే హీరోయిన్ లావ‌ణ్య త్రిపాఠిని వ‌రుణ్ తేజ్ పెళ్లి చేసుకోబోతున్నారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.