English | Telugu

గూగుల్‌ సెర్చ్‌ జాబితాలో మొదటి ఆరుగురు టాలీవుడ్‌ హీరోలే!

ఇండియాలో బాలీవుడ్‌దే పైచేయిగా ఉండేది. సౌత్‌కి చెందిన చిత్ర పరిశ్రమలు కొన్ని విషయాల్లో బాలీవుడ్‌పైనే ఆధారపడేవి. బాలీవుడ్‌లో సూపర్‌హిట్‌ అయిన అనేక సినిమాలను సౌత్‌లో రీమేక్‌ చేసేవారు. మార్కెట్‌ పరంగా బాలీవుడ్‌ పరిధి ఎక్కువగా ఉండేది. కానీ, ఇప్పటి పరిస్థితి వేరు. ఒక్కసారిగా బాలీవుడ్‌ని పక్కనపెట్టి టాలీవుడ్‌ తన సత్తా ఏమిటో చాటుతోంది. అంతేకాదు, తెలుగు సినిమా గ్లోబల్‌ స్థాయికి చేరుకుంది.

తెలుగు సినిమాల కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీంతో గూగుల్‌లో టాలీవుడ్‌ హీరోల సెర్చింగ్‌ కూడా అధికమైంది. 2025 సంవత్సరానికి సంబంధించి అత్యధికంగా గూగుల్‌లో సెర్చ్‌ చేసిన హీరోలకు సంబంధించిన జాబితా విడుదలైంది. ఈ లిస్ట్‌లో మొదటి ఆరు పేర్లూ టాలీవుడ్‌ హీరోలవే కావడం గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు. గతంలో బాలీవుడ్‌ హీరోల గురించే ఎక్కువగా గూగుల్‌ సెర్చ్‌ చేసేవారు. ఇప్పుడు అందులోకి టాలీవుడ్‌ హీరోలు వచ్చి చేరారు.

2025లో విడుదలైన భారీ బడ్జెట్‌ సినిమాల గురించి, వాటిలో హీరోలుగా నటించినవారి వ్యక్తిగత విషయాల గురించి, వారి నెక్స్‌ట్‌ ప్రాజెక్టుల గురించి తెలుసుకునేందుకు ఎక్కువ ఆసక్తి చూపించినట్టుగా తెలుస్తోంది. గూగుల్‌ సెర్చ్‌ జాబితాలో మొదటి స్థానంలో అల్లు అర్జున్‌ నిలవగా, రెండో స్థానంలో ప్రభాస్‌, మూడో స్థానంలో జూనియర్‌ ఎన్టీఆర్‌, నాలుగో స్థానంలో రామ్‌చరణ్‌, ఐదు, ఆరు స్థానాల్లో మహేష్‌బాబు, పవన్‌కళ్యాణ్‌ ఉన్నారు. బాలీవుడ్‌నే కాదు, గూగుల్‌ సెర్చ్‌ని కూడా ఆక్రమించిన టాలీవుడ్‌ హీరోలు ఇకపై మరెన్ని సంచలనాలు సృష్టిస్తారో చూడాలి.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.