English | Telugu
రాజు వెడ్స్ రాంబాయి ఓటిటి డేట్ ఫిక్స్! మరి ఫ్యాన్స్ ఏమంటున్నారు
Updated : Dec 13, 2025
-ఇదేనా ఆ డేట్
-అదే అయితే ఫ్యాన్స్ హ్యాపీ
-థియేటర్స్ లో సంచలనం
-మరి ఓటిటి లో!
గత నెల నవంబర్ 21 న థియేటర్స్ లో అడుగుపెట్టిన మూవీ రాజు వెడ్స్ రాంబాయి(Raju Weds Rambai). రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కగా అఖిల్ రాజ్, తేజస్విరావు జంటగా నటించారు. నటించారు అనే కంటే వాళ్లిదరు రాజు, రాంబాయి గా జీవించారని చెప్పవచ్చు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి విజయాన్ని అందుకోవడంతో పాటు ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరి హృదయాల్ని తాకిన సినిమాగా కూడా నిలిచింది.ముఖ్యంగా క్లైమాక్స్ చూసి బయటకి వచ్చి కన్నీళ్లు పెట్టుకున్న ప్రేక్షకులు ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడు ఈ మూవీ నుంచి ఓటిటి సినీ ప్రియులకి ఒక గుడ్ న్యూస్ వచ్చింది.
రాజు వెడ్స్ రాంబాయి ఓటిటి హక్కులు ఈటీవీ విన్(Etv Win)దగ్గర ఉన్నాయి. సదరు స్ట్రీమింగ్ ని డిసెంబర్ 19 నుంచి అందుబాటులోకి తీసుకొస్తునట్టుగా తెలుస్తోంది. నిజానికి తొలుత ఓ టిటి స్ట్రీమింగ్ నెక్స్ట్ ఇయర్ జనవరిలో స్ట్రీమింగ్ కి వస్తుందనే వార్తలు వచ్చాయి. కానీ ఈ నెల 19 నుంచే స్ట్రీమింగ్ కి తీసుకొస్తున్నట్టుగా చెప్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓటీటీ స్ట్రీమింగ్ పోస్టులు దర్శనమిస్తున్నాయి. మేకర్స్ అయితే ఈ డేట్ ని అధికారకంగా ప్రకటించలేదు.
Also read:రోషన్ కనకాల ఆశలని మోగ్లీ 2025 నెరవేర్చిందా! లేదా!
తెలంగాణ(Telangana)లోని ఖమ్మం జిల్లా ఇల్లెందు రూరల్ ఏరియాలో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా రాజు వెడ్స్ రాంబాయి తెరకెక్కింది.మొదటి షో నుంచే సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని 17 కోట్లకు పైగా కలెక్షన్లని రాబట్టి సంచలన విజయాన్ని నమోదు చేసింది. సాయిలు(Saailu)దర్శకుడు కాగా చైతన్య జొన్నలగడ్డ నెగిటివ్ క్యారక్టర్ లో చెయ్యగా శివాజీ రాజా, అనిత చౌదరి కథ కి ముఖ్యమైన క్యారెక్టర్స్ ని పోషించి మూవీ విజయంలో కీలక పాత్రలు పోషించారు.