English | Telugu

నటకిరీటి రాజేంద్రప్రసాద్ కి నట ప్రపూర్ణ కాంతారావు పురస్కారం!

ప్రముఖ సినీ నటుడు 300 పైగా చిత్రాలలో విభిన్న తరహ పాత్రలతో తనకంటూ తెలుగువారి గుండెల్లో ప్రత్యేక స్థానాన్ని పదిలపరుచుకున్ననవరస నటుడు నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ కి, నట ప్రపూర్ణ టి.ఎల్. కాంతారావు స్మారక జాతీయ పురస్కారాన్ని ఆయన 102వ జయంతి (నవంబర్ 16న) సందర్భంగా అందించనున్నట్లు ఎంపిక కమిటీ చైర్మన్ కే.వి. రమణా చారి, కన్వీనర్ నాగబాల సురేష్ కుమార్ లు పత్రిక ప్రకటనలో తెలియచేసారు.

ఈ నెల 21వ తేదిన ఫిల్మ్ ఛాంబర్ లో జరిగే కార్యక్రమం లో ఈ అవార్డు ప్రదానం ఉంటుందని, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణా రాష్ట్ర మంత్రివర్యులు కోమటి రెడ్డి వెంకట రెడ్డి , తెలంగాణా రాష్ట్ర ఎఫ్ డి సి చైర్మన్ దిల్ రాజు తో పాటు మరెందరో పరిశ్రమ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు పాల్గొంటున్నట్లు వారు తెలియ చేసారు.

గత 18 ఏళ్ళుగా కాంతారావు గారి జన్మ దినాన్ని తాము నవంబర్ 16న నిర్వహిస్తున్నామని, కాని ఈ సారి కొన్ని కారణాల వలన నవంబర్ 21న నిర్వహించాల్సి వచ్చిందని, ఆ రోజు కాంతారావు కుటుంభ సభ్యులు కూడా కార్యక్రమం లో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.