English | Telugu

రాజ‌మౌళీ... ఏముంద‌బ్బా గొప్ప‌?

ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ఎప్పుడూ ఆహా.. ఓహో అనే సినిమాలే తీశాడు. నో డౌట్‌... హీ ఈజ్ ఏ క్రియేట‌ర్‌. తాజాగా అత‌న్నుంచి స్పిరిట్ ఆఫ్ దీపావ‌ళి అనే కాన్సెప్ట్‌తో ఓ ల‌ఘు చిత్రం వ‌చ్చింది. హుద్ హుద్ బాధితుల‌ను ఆదుకోండి - అందులోనే దీపావ‌ళి వెలుగుల్ని చూడండి అనేది రాజ‌మౌళి చెప్పాల‌నుకొన్న పాయింట్‌. ల‌ఘు చిత్రంలో అది బాగానే క్యారీ అయ్యింద‌నుకోండి. ఇంత‌కీ ఆ కాన్సెప్ట్ మాత్ర‌మే రాజ‌మౌళిది. తీసింది - చేసిందీ రాజీవ్ మీన‌న్ అండ్ కో. అయితే ఇందుకు సంబంధించి ఆ షార్ట్ ఫిల్మ్‌లో ఎక్క‌డా గౌత‌మ్ మీన‌న్ పేరు ప్ర‌స్తావించ‌లేదు. అంతా నేనే చేశానన్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. పోనీ కాన్సెప్ట్ రాజ‌మౌళి ది కాబ‌ట్టి క్రెడిట్ కూడా ఆయ‌న‌దే అనుకోవ‌చ్చు. కానీ ఆ పాయింట్ కొత్త‌గా ఏం అనిపించడం లేదు. ఈమ‌ధ్య సుకుమార్ ఓ షార్ట్ ఫిల్మ్ తీశాడు. ఐ యామ్ ద‌ట్ ఛేంజ్ పేరుతో. రాజ‌మౌళి కూడా దాదాపుగా అదే స్ర్కీన్ ప్లేని ఫాలో అయిపోయాడు. తుఫాను బాధుతుల‌ను ఆదుకోండి అన్న పాయింట్ అయితే అంద‌రికీ చేరువైంది... ఆ విష‌యంలో రాజ‌మౌళిని మెచ్చుకోవాలి. అయితే ఆ షార్ట్ ఫిల్మ్ తీసిచ్చిన రాజీవ్ మీన‌న్‌కి క్రెడిట్ ఇవ్వ‌క‌పోవ‌డం మాత్రం స‌మంజ‌సంగా అనిపించ‌డం లేదు. తార‌లంతా త‌లో చేయీ వేసి హుద్ హుద్ బాధితుల‌ను ఆదుకొంటుంటే.. రాజ‌మౌళి షార్ట్ ఫిల్మ్‌తో స‌రిపెట్ట‌డం కూడా ఏం బాలేదు. త‌న వంతుగా ఏమిచ్చాడో చెబితే.. మిగిలిన‌వాళ్ల‌కూ ఆద‌ర్శంగా ఉండేది క‌దా.. అన్న‌ది జ‌నాల పాయింట్ ఆఫ్ వ్యూ. మ‌రి జ‌క్క‌న్న ఏమంటాడో చూడాలి.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.