English | Telugu

అసలు ఇందుకే చనిపోతున్నారు..జాకెంట్ ఇండియా రావాలంటున్న పూరి జగన్నాధ్ 

స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాధ్(puri jagannadh)ప్రస్తుతం వరుస పరాజయాలని చవి చూస్తున్నాడు.విజయ్ దేవరకొండ తో చేసిన లైగర్,రామ్ పోతినేని తో చేసిన డబుల్ ఇస్మార్ట్ పై పూరి ఎన్నో ఆశలు పెట్టుకున్నాకూడా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.ప్రస్తుతానికైతే తన అప్ కమింగ్ మూవీ మీద ఎలాంటి అప్ డేట్ ఇంకా రాలేదు.

ఇక పూరి ఎప్పట్నుంచో సోషల్ మీడియాలో 'పూరి మ్యూజింగ్స్' ద్వారా రకరకాల అంశాల గురించి తన అభిప్రాయాలని వ్యక్తం చేస్తుంటాడు.రీసెంట్ గా 'జాకెంట్' అనే అంశం మీద ఆయన మాట్లాడుతు యుద్ధ సమయాలతో పాటు రక రకాల ఇబ్బందులు వల్ల చాలా మంది ప్రజలు కట్టుబట్టలతో,భార్య బిడ్డల్ని తీసుకొని వేరే ప్రాంతాలకి వలస వెళ్తుంటారు. వీరు ఏ దేశమైతే వెళ్తారో అక్కడ ఇల్లు అనేది ఉండదు.నైజీరియా,ఇరాక్,సుడాన్,ఇండియా,చైనా,కాలిఫోర్నియా, న్యూయార్క్,ఇరాక్, ఫ్లోరిడా వంటి దేశాల్లో ఇల్లు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు.ప్రపంచంలో ఐదు శాతం జనాభాకి ఇల్లు కూడా లేదు.ఇండియాలో అయితే నాలుగు కోట్ల మంది అడుక్కు తినే వాళ్ళు కూడా ఉన్నారు.అలాంటి వాళ్లంతా వర్షం వస్తే ఎక్కడ ఉండాలో తెలియని పరిస్థితి.ఇలా వసతి సోకార్యం లేకుండా వడ దెబ్బతో పాటు తీవ్రమైన చలికి చాలా మంది చనిపోతున్నారు.

అలాంటి వారందరి కోసం 'ఏంజెలా లూనా' అనే ఒక మహిళాడిజైనర్ ఒక అద్భుతమైన డిజైన్ ని సృష్టించింది.దాని పేరు 'జాకెంట్'.జాకెట్,టెంట్ ని కలిపి చేసిన డిజైన్ అది.దీన్ని జాకెట్ ల వేసుకోవడంతో పాటు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు టెంట్ లా వాడుకొని అందులో పడుకోవచ్చు.పైగా ఈ జాకెంట్ ఎంతో మంది సిరియా శరణార్థులని కాపాడింది.ఇప్ప్పుడు ఆ 'జాకెంట్'.ఇండియాకి వస్తే మనం
ఏదైనా కాంప్ కి వెళ్ళినప్పుడు వాడుకోవడంతో పాటుగా అడుక్కునే వాళ్ళకి కూడా ఇవ్వచ్చు.ఏదైనా కంపెనీ దీనిని ఇండియాకి పరిచయం చేస్తే బాగుండు.ఎంతో మంది ప్రాణాలని కాపాడిన వాళ్లవుతారని చెప్పుకొచ్చాడు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .