English | Telugu

రెండో రోజుకే పూర్తిగా చేతులెత్తేసిన 'ఏజెంట్'.. 'పిఎస్-2'దే పైచేయి!

అఖిల్ అక్కినేని హీరోగా సురేందర్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'ఏజెంట్'. మమ్మూట్టి కీలక పాత్ర పోషించిన ఈ చిత్రం ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షో నుంచే ఫ్లాప్ టాక్ సొంతం చేసుకున్న ఈ మూవీ మొదటి రోజు ఆశించిన స్థాయిలో ఓపెనింగ్స్ రాబట్టలేకపోయింది. ఇక రెండో రోజు పూర్తిగా చేతులెత్తేసింది. రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో డబ్బింగ్ సినిమా 'పొన్నియిన్ సెల్వన్-2'కి వచ్చిన దానిలో సగం కూడా రాబట్టలేకపోయింది అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. 'ఏజెంట్', 'పొన్నియిన్ సెల్వన్-2' సినిమాలు ఒకేరోజు విడుదలయ్యాయి. పొన్నియిన్ సెల్వన్ మొదటి భాగం ఆకట్టుకోకపోవడంతో.. రెండో భాగంపై తెలుగు ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపించలేదు. దాంతో తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు ఏజెంట్ రూ.4 కోట్ల షేర్ రాబట్టగా.. 'పిఎస్-2' రూ.1.37 కోట్ల షేర్ తో సరిపెట్టుకుంది. ఇక రెండు రోజు సీన్ రివర్స్ అయింది. ఏజెంట్ కేవలం 67 లక్షల షేర్ రాబట్టగా.. పిఎస్-2 మాత్రం ఏకంగా 1.58 కోట్ల షేర్ రాబట్టింది. మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లో ఏజెంట్ పై పిఎస్-2 పైచేయి సాధించేలా ఉంది.

రూ.37 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలోకి దిగిన ఏజెంట్.. మొదటి రోజు వరల్డ్ వైడ్ గా రూ.4.95 కోట్ల షేర్ తో పరవాలేదు అనిపించుకుంది. రెండో రోజు మాత్రం రూ.81 లక్షల షేర్ రాబట్టి దారుణంగా నిరాశపరిచింది. దీంతో రెండు రోజుల్లో రూ. 5.76 కోట్ల షేర్ తో సరిపెట్టుకుంది. బ్రేక్ ఈవెన్ సాధించాలంటే ఇంకా 31 కోట్లకు పైగా షేర్ రాబట్టాల్సి ఉంది. కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే మరో కోటి, రెండు కోట్లకు మించి రాబట్టేలా లేదు. అదే జరిగితే దాదాపు 30 కోట్లు లాస్ వచ్చినట్టు అవుతుంది.

'ఏజెంట్' కి ఫ్లాప్ టాక్, దారుణమైన కలెక్షన్స్ రావడం పట్ల అక్కినేని అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు. 2015 లో విడుదలైన 'అఖిల్' అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అఖిల్. భారీ అంచనాలతో విడుదలైన ఆ చిత్రం ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ ఎనిమిదేళ్ల కెరీర్ లో మొత్తం ఐదు సినిమాలు చేశాడు అఖిల్. అందులో ఒక్క 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్' తప్ప.. మిగతా నాలుగు ఘోర పరాజయాలే. ముఖ్యంగా ఏజెంట్ చిత్రం అఖిల్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్ గా నిలిచేలా ఉంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.