English | Telugu

మరోసారి యూత్‌ని టార్గెట్‌ చేసిన ప్రదీప్‌.. ‘డ్యూడ్‌’లో అన్నీ ఉన్నాయి!

ఇటీవలి కాలంలో భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్స్‌తో పాటు యూత్‌ని టార్గెట్‌ చేస్తూ రూపొందిన సినిమాలు కూడా భారీ విజయాలు అందుకుంటున్నాయి. దర్శకనిర్మాతలు కూడా ప్రజెంట్‌ జనరేషన్‌ యూత్‌కి కనెక్ట్‌ అయ్యే సబ్జెక్టులతోనే ఫుల్‌ లెంగ్త్‌ ఎంటర్‌టైనర్స్‌ను రూపొందిస్తున్నారు. ఆమధ్య వచ్చిన ‘లవ్‌టుడే’ సినిమాని కూడా అదే పంథాలో చేశారు. ఈ సినిమా రిలీజ్‌ అయ్యే వరకు అందులో హీరోగా నటించిన ప్రదీప్‌ రంగనాథన్‌ అంటే ఎవరికీ తెలీదు. ఆ సినిమా సూపర్‌హిట్‌ అవ్వడంతో యూత్‌లో మంచి ఫాలోయింగ్‌ సంపాదించుకున్నాడు. తాజాగా మరో యూత్‌ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు ప్రదీప్‌. ‘డ్యూడ్‌’ పేరుతో రూపొందిన యూత్‌ఫుల్‌ మూవీ ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌.

మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై తెలుగు నిర్మాతలు నిర్మించిన తమిళ సినిమా ఇది. ఈ సినిమాకి కీర్తీశ్వరన్‌ దర్శకత్వం వహించారు. అక్టోబర్‌ 17న దీపావళి కానుకగా ఈ చిత్రం విడుదల కాబోతోంది. తెలుగులో కూడా అదే రోజు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఒక డిఫరెంట్‌ యాటిట్యూడ్‌ ఉన్న కుర్రాడి జీవితంలోకి ఒక అమ్మాయి ప్రవేశిస్తే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వచ్చింది అనే అంశంపై సినిమా కథ ఉంటుంది. స్టార్టింగ్‌ నుంచి ఎండింగ్‌ వరకు ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉంటూనే సినిమాలో లవ్‌ ఫీల్‌ కూడా ఉంది. అలాగే కొన్ని సెంటిమెంట్‌ సీన్స్‌ కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ఉన్నాయి. రొమాంటిక్‌ యాక్షన్‌ కామెడీ మూవీగా ఈ చిత్రాన్ని రూపొందించారు. అన్ని ఎమోషన్స్‌లో హీరో ప్రదీప్‌ రంగనాథన్‌ పెర్‌ఫార్మెన్స్‌ బాగుంది. అతనికి పెయిర్‌గా నటించిన మమిత బైజు కూడా క్యూట్‌గా ఉంది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.