English | Telugu

యంగ్ హీరోలకు అన్యాయం జరుగుతోంది.. కిరణ్‌ అబ్బవరం ఆవేదన!

ఒకప్పుడు ఒక భాషలో తీసిన సినిమాలను ఆ భాషలోనే రిలీజ్‌ చేసేవారు. హిట్‌ అయిన సినిమాల రైట్స్‌ తీసుకొని ఇతర భాషల్లో రీమేక్‌ చేసేవారు. కానీ, ఇప్పుడా పరిస్థితి లేదు. యూనివర్సల్‌ అప్పీల్‌తోనే కథలు ఎంపిక చేసుకుంటున్నారు. దానికి తగ్గట్టుగానే ఆ సినిమాలోని ఆర్టిస్టుల ఎంపిక కూడా జరుగుతోంది. అయితే ఇది భారీ బడ్జెట్‌ సినిమాల విషయంలోనే జరుగుతోంది. ఇక ప్రతి భాషలోనూ తక్కువ బడ్జెట్‌ సినిమాలు, యూత్‌ సినిమాలు రిలీజ్‌ అవుతూనే ఉన్నాయి. వాటిని కూడా ఇతర భాషల్లోకి అనువదించి రిలీజ్‌ చేస్తున్నారు. అలా ఇటీవలికాలంలో ఎన్నో పరభాషా చిత్రాలు తెలుగులో రిలీజ్‌ అయి ఘనవిజయం సాధించాయి. సినిమా పుట్టిన నాటి నుంచి ఇప్పటివరకు తెలుగు ప్రేక్షకులు అన్ని భాషా చిత్రాలను ఆదరించాలి అనే ఆలోచనతోనే ఉన్నారు. హీరో ఎవరు, ఏ భాష నుంచి వచ్చిన సినిమా అనేది చూడకుండా కంటెంట్‌ బాగుంటే ప్రతి సినిమాను సూపర్‌హిట్‌ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. కొన్ని రాష్ట్రాల ఫిలిం ఇండస్ట్రీలలో తెలుగు సినిమా అంటే తక్కువ అనే భావన ఇప్పటికీ వుంది. కొన్ని సినిమాలను వారి వారి రాష్ట్రాల్లో విడుదల కాకుండా చేస్తున్నారు. అక్కడి డిస్ట్రిబ్యూటర్లుగానీ, ఎగ్జిబిటర్లుగానీ మన చిన్న సినిమాలను పక్కన పెడుతున్నారు. ఆ సినిమాలకు థియేటర్లు దొరక్కుండా చేస్తున్నారు. దీంతో కొన్ని తెలుగు సినిమాలకు రావాల్సినంత రెవిన్యూ రావడం లేదు. దాని వల్ల చిన్న నిర్మాతలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయంపై టాలీవుడ్‌ హీరో కిరణ్‌ అబ్బవరం కీలక వ్యాఖ్యలు చేశారు.

‘తెలుగు హీరోలు చేసిన సినిమాలకు ఇతర రాష్ట్రాల్లో థియేటర్లు దొరక్కుండా చేస్తున్నారు. తమిళనాడులో ఈ సమస్య తీవ్రంగా ఉంది. అక్కడ థియేటర్లు దొరకడం చాలా కష్టంగా మారింది. నేను నటించిన ‘క’ చిత్రం గత ఏడాది దీపావళికి రిలీజ్‌ అయింది. తమిళనాడులో మాత్రం రిలీజ్‌ అవ్వలేదు. అక్కడ స్క్రీన్స్‌ ఇవ్వకపోవడమే దానికి కారణం. తమిళ్‌ నుంచి వచ్చే యంగ్‌ హీరోల సినిమాలను మన తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. కానీ, మనకు మాత్రం థియేటర్ల విషయంలో అక్కడ అన్యాయం జరుగుతోంది. చాలా మంది తమిళ హీరోలకు తెలుగులో అభిమానులు ఉన్నారు. వారి సినిమాలను ఎంతో ఆదరిస్తారు. దానికి ప్రతిఫలంగా మన సినిమాలను కూడా వాళ్లు ఆదరించాలని కోరుకుంటున్నాం’ అన్నారు కిరణ్‌ అబ్బవరం.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.