English | Telugu

కృష్ణంరాజు విగ్రహాన్ని చూసి ఉలిక్కిపడ్డ ప్రభాస్‌... ఎందుకో తెలుసా?

అప్పటి తరం హీరోల్లో కృష్ణంరాజుకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. భారీ విగ్రహంతోపాటు చక్కని హావ భావాలు, పెరోషియస్‌ క్యారెక్టర్స్‌లో అతను చూపిన ప్రతిభ అప్పట్లో సంచలనంగా ఉండేది. అందుకే కృష్ణంరాజు రెబల్‌స్టార్‌ అయ్యారు. ఆయనకు ముగ్గురూ కుమార్తెలే ఉండడంతో తన తమ్ముడి కొడుకైన ప్రభాస్‌నే తన నటవారసుడిగా ప్రకటించారు కృష్ణంరాజు. తన కొడుకులాంటి ప్రభాస్‌ ఎదుగుదల చూసి అంతులేని ఆనందాన్ని పొందారాయన. దానికి తగ్గట్టుగానే ప్రభాస్‌ కూడా కృష్ణంరాజుని కన్నతండ్రి కంటే ఎక్కువగా గౌరవించేవాడు. కొన్ని సినిమాల్లో ప్రభాస్‌తో కలిసి నటించి ఎంతో సంతృప్తిని పొందారు కృష్ణంరాజు. ఎన్నో గొప్ప సినిమాలు నిర్మించి నిర్మాతగా కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. అలాంటి కృష్ణంరాజు గత ఏడాది ఆయన కుటుంబాన్ని, అభిమానుల్ని శోక సముద్రంలో ముంచేసి వెళ్ళిపోయారు. కృష్ణంరాజు అంటే మర్యాదలకు పెట్టింది పేరు. అలాంటి మర్యాదలనే పుణికి పుచ్చుకున్న ప్రభాస్‌ ఆయన బాటలోనే నడుస్తారు. కృష్ణంరాజు చనిపోయిన రోజు వివిధ ప్రాంతాల నుంచి అభిమానులు వేల సంఖ్యలో తరలివచ్చారు. అంత బాధలోనూ వచ్చిన వారందరికీ భోజనాలు ఏర్పాటు చేసి కృష్ణంరాజు వారసుడు అనిపించుకున్నాడు ప్రభాస్‌. ఆ తర్వాత కృష్ణంరాజు స్వగ్రామం అయిన మొగల్తూరులోఆయన సంస్మరణ సభ ఏర్పాటు చేసి లక్ష మందికి పైగా అభిమానులకు విందు ఏర్పాటు చేసిన ఘనత ప్రభాస్‌ కుటుంబానికే దక్కింది.

గత నెలలో కృష్ణంరాజు సంత్సరీకం జరిగింది. పిఠాపురానికి చెందిన ఓ అభిమాని కృష్ణంరాజు విగ్రహాన్ని ఆయన భార్య శ్యామలాదేవికి అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘‘ఈ విగ్రహంలో ఎంతో జీవకళ ఉంది. అందుకే ఆయన లేరన్న బాధ లేదు. ఆయన మా పక్కనే ఉన్నారన్న ఆనందంతో ఉన్నాను. ఈ విగ్రహాన్ని చూసి ప్రభాస్‌ ఒక్కసారిగా ఉలిక్కిపడి వెనక్కి వెళ్లిపోయాడు. నిమిషంపాటు ఏమీ మాట్లాడలేకపోయాడు. ఆ విగ్రహాన్ని చూసి ఎంతో ఆశ్చర్యపోయాడు. నిజంగా పెదనాన్న వచ్చారా అనే ఫీలింగ్‌ అతనికి కలిగింది. విగ్రహాన్ని అందించిన అభిమానిని మెచ్చుకున్నాడు.

పెదనాన్న నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని రెబల్‌స్టార్‌గా ఎదిగిన ప్రభాస్‌ ప్రస్తుతం సలార్‌, కల్కి, స్పిరిట్‌, డీలక్స్‌ రాజా వంటి భారీ సినిమాలు చేస్తూ పెదనాన్నను మించిన తనయుడుగా పేరు తెచ్చుకుంటున్నాడు. వీటిలో సలార్‌ ఈ సంవత్సరం డిసెంబర్‌ 22న విడుదలకు సిద్ధమైంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.