English | Telugu

ఆహాలో అవార్డ్ విన్నింగ్ మూవీ 'మట్టి కథ'

వైవిధ్య‌మైన క‌థాంశంతో విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు పొందిన చిత్రం 'మట్టి కథ'. ఈ సినిమా ఇండో ఫ్రెంచ్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫెస్టివ‌ల్‌లో ఏకంగా 9 అవార్డుల‌ను సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో అలరించడానికి సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ వేదిక ఆహాలో అక్టోబ‌ర్ 13 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

తెలంగాణ‌ ప‌ల్లెటూరి నేప‌థ్యంతో రూపొందిన సినిమాయే 'మట్టి కథ'. భూమయ్య(అజయ్ వేద్), శ్రీను(అక్షయ్ సాయి), యాదగిరి(రాజు ఆలూరి), రాజు(బత్తుల తేజ) అనే కాలేజీ చదివే నలుగురు కుర్రాళ్ల మ‌ధ్య సాగే క‌థ‌తో సినిమాను రూపొందించారు. ఈ న‌లుగురిలో ముగ్గురు స్నేహితులు స‌ర‌దాగా స‌మ‌యాన్ని గ‌డిపేస్తుంటారు. కానీ భూమ‌య్య మ‌రోలా ఆలోచిస్తుంటాడు. అందుకు కార‌ణం.. త‌ను రాజి(మాయ) అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. ఈ న‌లుగురి క‌థ ఓ వైపు ఇలా సాగుతుండ‌గా మ‌రో వైపు.. వారి గ్రామంలో భూ ఆక్ర‌మ‌ణ‌ల స‌మ‌స్య మొద‌ల‌వుతుంది. అప్పుడే భూమ‌య్య జీవితం అనుకోని మ‌లుపు తీసుకుంటుంది. ఆ ఘ‌ట‌న‌తో భూమ‌య్య జీవితం త‌ల‌కిందుల‌వుతుంది. విధిరాతను మార్చే నిర్ణ‌యాల‌తో భూమ‌య్య ప్ర‌పంచం మారిపోతుంది.

అజ‌య్ వేద్‌, మాయ‌, క‌న‌క‌వ్వ‌, ద‌యానంద్ రెడ్డి, సుధాక‌ర్ రెడ్డి, బల్వీర్ సింగ్, అక్ష‌య్ సాయి, రాజు ఆలూరి, రుచిత‌, బ‌త్తుల తేజ త‌దిత‌రులు మ‌ట్టి క‌థ‌ సినిమాలో ప్ర‌ధాన తారాగ‌ణంగా న‌టించి మెప్పించారు. ప‌వ‌న్ క‌డియాల ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. అప్పిరెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి స్మ‌ర‌ణ్ సాయి సంగీతాన్ని అందించారు. సాయినాథ్ సినిమాటోగ్ర‌ఫీ బాధ్య‌త‌ల‌ను నిర్వ‌హించారు.

స్నేహం, ప్రేమ అనే ఎలిమెంట్స్‌తో పాటు బ‌ల‌మైన భావోద్వేగాల‌తో రూపొందిన మ‌ట్టిక‌థ సినిమా అక్టోబ‌ర్ 13 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.