English | Telugu

‘సలార్‌’ ట్రైలర్‌ రికార్డు సృష్టిస్తోంది.. ఇప్పుడు రెండో ట్రైలర్‌ రాబోతోంది!

ఈమధ్యకాలంలో ఎంతో హైప్‌ తెచ్చుకున్న సినిమా ‘సలార్‌’. పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌, కెజిఎఫ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌లో ఈ సినిమా రూపొందుతుండడంతో సినిమాకి భారీ హైప్‌ వచ్చింది. డిసెంబర్‌ 1న విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌ 24 గంటల్లోనే 110 మిలియన్‌ వ్యూస్‌ సాధించి కొత్త రికార్డు క్రియేట్‌ చేసింది. ఈ మూడు రోజుల్లో 135 మిలియన్‌కి పైగా వ్యూస్‌ సాధించి ముందుకు దూసుకెళ్తోంది. ఈ ట్రైలర్‌ మరిన్ని రికార్డులు క్రియేట్‌ చేసే అవకాశం ఉంది.

ఇదిలా ఉంటే.. ‘సలార్‌’ సినిమాకి సంబంధించి ఒక ట్రైలర్‌తో సరిపెట్టడంలేదు ప్రశాంత్‌ నీల్‌. మరో ట్రైలర్‌ను త్వరలోనే రిలీజ్‌ చేయబోతున్నారు. ఇది ఈనెల 15`18 తేదీల మధ్య రిలీజ్‌ కానుంది. మొదటి ట్రైలర్‌ 3 నిమిషాలపైన ఉన్నప్పటికీ అందులో ప్రభాస్‌ కనిపించింది కాసేపే. అందుకే మరో ట్రైలర్‌ను రిలీజ్‌ చేసి ఫ్యాన్స్‌ని ఖుషీ చేయనున్నారు మేకర్స్‌. అయితే ఇది రెగ్యులర్‌ ట్రైలర్‌లా కాకుండా ఒక ఇంపార్టెంట్‌ యాక్షన్‌ కట్‌తో ఉంటుందట. అలాగే దీనికి ట్రైలర్‌ అని కాకుండా మరో కొత్త పేరు పెడతారని తెలుస్తోంది. ఈ సినిమాను రెండు భాగాలుగా రిలీజ్‌ చేయబోతున్న విషయం తెలిసిందే. మొదటి భాగానికి ‘సలార్‌ సీజ్‌ఫైర్‌’ అనే పేరు పెట్టారు. అయితే సెకండ్‌ పార్ట్‌కి సలార్‌ టైటిల్‌తో ఏ పదాన్ని జోడిస్తారో చూడాలి. డిసెంబర్‌ 22న విడుదల కాబోతున్న ‘సలార్‌ సీజ్‌ఫైర్‌’ డెఫినెట్‌ భారీ కలెక్షన్లు సాధిస్తుందని ట్రైలర్‌కి వచ్చిన వ్యూస్‌ని బట్టే తెలుస్తోంది. మరి ఈ సినిమాతో ప్రభాస్‌, ప్రశాంత్‌ నీల్‌ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తారో చూడాలి.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.