English | Telugu

వరల్డ్ వార్ బ్యాక్ డ్రాప్ లో ప్రభాస్ మూవీ!

హను రాఘవపూడి దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఓ సినిమా చేయనున్నట్లు ఇటీవల వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. లవ్ స్టోరీలు తీయడంలో దిట్టగా పేరు తెచ్చుకున్న హను.. ప్రభాస్ తో చేయబోయేది మాత్రం లవ్ స్టోరీ కాదని కూడా టాక్ వినిపించింది. అంతేకాదు ఇది వరల్డ్ వార్ నేపథ్యంలో తెరకెక్కనున్న చిత్రమని తాజాగా న్యూస్ వినిపిస్తోంది.

'బాహుబలి'తో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్.. స్టార్ దర్శకులతో కంటే కూడా యంగ్, మీడియం రేంజ్ దర్శకులతోనే ఎక్కువగా సినిమాలు చేస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు. తాజాగా ఆయన దర్శకుడు హను రాఘవపూడితో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. 'అందాల రాక్షసి'తో దర్శకుడిగా పరిచయమైన హను.. ప్రేమ కథా చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా గతేడాది విడుదలైన 'సీతా రామం' క్లాసిక్ హిట్ గా నిలిచి, ఆయనకు మరింత పేరు తీసుకొచ్చింది. ఇప్పుడు ఆయన ఏకంగా ప్రభాస్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ దక్కించుకున్నాడని ఇన్ సైడ్ టాక్. ప్రపంచ యుద్ధం నేపథ్యంలో రూపొందనున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందించనుందట.

ప్రస్తుతం ప్రభాస్ చేతిలో పలు సినిమాలు ఉన్నాయి. జూన్ 16న 'ఆదిపురుష్'తో ప్రేక్షకులను పలకరించనున్నాడు. 'సలార్', 'ప్రాజెక్ట్ కె'తో పాటు మారుతీ దర్శకత్వంలో చేస్తున్న సినిమా షూటింగ్ దశలో ఉన్నాయి. అలాగే సందీప్ రెడ్డి దర్శకత్వంలో 'స్పిరిట్' చిత్రాన్ని ప్రకటించాడు. 'స్పిరిట్'తో పాటు, హను రాఘవపూడి ప్రాజెక్ట్ పారలల్ గా షూటింగ్ జరుపుకోనుందని వినికిడి.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.