English | Telugu

టీజర్ దెబ్బకి 30కోట్ల బిజినెస్..!

మాస్ మహారాజ రవితేజ 'పవర్' సినిమా షూటింగ్ ఓ పాట చిత్రీకరణ మినహా మొత్తం కంప్లీట్ అయింది. ఇప్పటివరకు సైలెంట్ గా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న ఈ సినిమాకి రీసెంట్ గా రిలీజ్ చేసిన ట్రైలర్స్ తో కావల్సిన పవర్ వచ్చి చేరింది. అసలు విషయం ఏమిటంటే..రవితేజ వరుస ఫ్లాప్ లతో సతమతమవుతున్న టైంలో బలుపుతో మళ్ళీ ట్రాక్ లోకి వచ్చాడు. ఆ తరువాత కొత్త దర్శకుడితో 'పవర్' సినిమాని స్టార్ట్ చేశాడు. రవితేజ 'పవర్'తో బయటపడవచ్చని నిర్మాతలు కూడా భావించారు. అయితే కొత్త దర్శకుడు కావడంతో సినిమా షూటింగ్ మొదలుపెట్టినప్పటి నుంచి డిస్టిబ్యూటర్స్ ఆ సినిమాని పట్టించుకోలేదు. దీంతో వారు కొంత కలవరానికి గురవుతున్న టైంలో 'పవర్' టీజర్స్ రిలీజై సినిమాకి మంచి క్రేజ్ తెచ్చాయి. పక్కా మాస్ మసాలా చిత్రంగా ఈ చిత్రం రూపొందిందని టాక్ తేవటంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ ఊపందుకుంది. రవితేజ కేరియార్ లోనే రికార్డ్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఈ సినిమా చేసిందట. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం..ఈ సినిమా వరల్డ్ వైడ్ బిజినెస్ 23.5 కోట్లు జరిగిందట. నైజాం 7.5కోట్లు, ఎపి రైట్స్ 12కోట్లు, కర్ణాటక 2కోట్లు, ఓవర్ సీస్, మిగిలిన ఇండియా రైట్స్ కలిపి 2 కోట్లు పలికాయట. ఇక ఆడియో,శాటిలైట్ రైట్స్ కలిపి 7.5కోట్లు చేశాయట. మొత్తం కలిపి 30కోట్ల బిజినెస్ రాబట్టిన ఫుల్ ఖుషీగా వున్నారట.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.