English | Telugu

రాబిన్ విలియమ్స్ సూసైడ్..సమంత దిగ్భ్రాంతి

హాలీవుడ్ నటుడు, ఆస్కార్ అవార్డ్ గ్రహీత రాబిన్ విలియమ్స్ (63) బలవన్మరణాన్ని ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. రాబిన్ విలియమ్స్ ఆకస్మిక మరణానికి చింతిస్తూ పలువురు సెలబ్రెటీలు ట్విట్టర్‌ ద్వారా తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసారు. ఈ విషయంపై సమంత స్పందిస్తూ.. ఈ విష‌యం తెలియ‌గానే దిగ్భ్రాంతికి గురయ్యా. ఆ క్షణం నుంచి ఆయ‌న గురించే ఆలోచిస్తున్నా. రాబిన్స్ న‌ట‌న‌ని ఎంత ఇష్టపడ్డానో ఇప్పుడే తెలుస్తోంది. మనకు ఎన్ని సమస్యలు ఎదురైనా ఎదుర్కొని నిల‌బ‌డాలి. రేప‌టి రోజు ఎలా ఉంటుందో ఎవ‌రు చెప్పగలరు? అని ట్విట్టర్‌ లో రాసింది స‌మంత‌.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.