English | Telugu

నాలుగు సంవత్సరాల్లో 750 ఇంజక్షన్స్.. నటుడి ధీనస్థితి

మెగాస్టార్ 'చిరంజీవి'(Chiranjeevi),దర్శకేంద్రుడు 'రాఘవేంద్రరావు'( k.Raghavendrarao)కాంబినేషన్ లో వచ్చిన ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో 'ఘరానా మొగుడు' కూడా ఒకటి. ఈ మూవీలో వచ్చే మొదటి ఫైట్ లో 'వీరయ్య'గా చిరంజీవితో తలపడి మంచి గుర్తింపు పొందిన తమిళ నటుడు 'పొన్నాంబళం'(Ponnambalam). బాలకృష్ణ(Balakrishna),నాగార్జున, వెంకటేష్, పవన్ కళ్యాణ్, (Pawan Kalyan)వెంకటేష్, ప్రభాస్ వంటి స్టార్ హీరోల చిత్రాల్లో కూడా ఫైటర్ గా తన సత్తా చాటాడు.

పొన్నాంబళం గత కొంత కాలం నుంచి కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నాడు. ఈ విషయాన్నీ తనే స్వయంగా అందరకి తెలియచేసాడు. రెండు మూత్ర పిండాలు చెడిపోయి, డయాలసిస్ అవసరం కావడంతో వెంటిలేటర్ పై ఉండి చికిత్స అందుకుంటున్నాడు. ఈ విషయంపై రీసెంట్ గా పొన్నాంబళం మాట్లాడుతు ప్రస్తుతం డయాలసిస్ నుంచి కోలుకుంటున్నాను. ఇప్పటి వరకు నాలుగు సంవత్సరాల్లో 750 ఇంజంక్షన్స్ ఇచ్చారు. రెండు రోజులుకి ఒకసారి రెండు ఇంజెక్షన్స్ చేసి నా ఒంటిలోని రక్తాన్ని తీసి డయాలసిస్ చేసేవారు. పూర్తిగా భోజనం చెయ్యలేను. ఉప్పు వాడలేను. పగ వాడికి కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదు.ఎక్కువ మద్యం సేవించడం వల్లే డయాలసిస్ బారిన పడ్డాను. చాలా ఏళ్ళ క్రితమే మద్యం ఆపేసినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని చెప్పుకొచ్చాడు.

ఇప్పటికే చిరంజీవి, శరత్ కుమార్, ధనుష్, అర్జున్ వంటి వారు 'పొన్నాంబలం' కి ఆర్ధిక సాయం చేసారు 1988 లో తమిళ సినీ రంగ ప్రవేశం చేసిన 'పొన్నాంబళం' తమిళ, తెలుగు, కన్నడ, హిందీ,మలయాళం భాషల్లో కలిపి సుమారు వెయ్యికి పైగా చిత్రాల్లో ఫైటర్, విలన్, క్యారక్టర్ ఆర్టిస్ట్ గా మెప్పించాడు. ఒంటిపై ఒక్క గాయం కూడా లేకుండా ప్రమాదకర యాక్షన్ సన్నివేశాలు చెయ్యడంలో పొన్నాంబళం స్పెషలిస్ట్.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.