English | Telugu

మిస్సమ్మను రీ-రీమిక్స్ చేస్తున్న చెర్రీ

అలనాటి "మిస్సమ్మ" సినిమాలో "ఆడువారి మాటలకూ..." పాట ఎంత పాపులర్ అయ్యిందో అందరికి తెలిసిందే. ఈ పాటను పవన్ కళ్యాణ్ తన సినిమాలో రీమిక్స్ చేసి "ఖుషి" సినిమాలో వాడుకున్నాడు. ఈ పాట కూడా బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. అయితే ఇపుడు బాబాయ్ పాటను తనయుడు రీ-రీమిక్స్ చేస్తున్నాడు.

కృష్ణవంశీ దర్శకత్వంలో రాంచరణ్, కాజల్ జంటగా నటిస్తున్న చిత్రం "గోవిందుడు అందరివాడేలే". ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో ఈ పాటను రీమిక్స్ చేస్తున్నారు. ఈ పాటను చరణ్, కాజల్ లపై చిత్రీకరించనున్నారు. పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్లో నిర్మాత బండ్ల గణేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇంటిల్లిపాదీ చూసి ఆనందించే విధంగా ఉంటుందని చిత్ర యూనిట్ అంటున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియనున్నాయి.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.