English | Telugu

ఫింగర్ వాడమంటున్న హాట్ బ్యూటీ

ఎన్నికల్లో ఓటు వేయమని, అది మన బాధ్యత అని రాష్ట్ర రాజకీయ పార్టీ కార్యకర్తలు, స్వచ్చంద సంస్థలు రకరకాలుగా ప్రచారం చేస్తుంటారు. ఓటు విలువ ఏంటో, దానివల్ల మన దేశానికి ఎలాంటి ఉపయోగం ఉందొ చెపుతూ ఓటు వేయాలని సూచిస్తారు. కానీ ఇదంతా మంచి మంచి మాటలతో పధ్ధతిగా చెబితే జనాలకు నచ్చి ఓటు వేయడానికి సిద్ధం అవుతారు. కానీ కొంచెం రొమాంటిక్ గా, సెక్సీ చూపులతో, ద్వందార్ధాలు వచ్చే విధంగా చెప్తే ఎలా ఉంటుంది? ఓటు వేయడం మానేసి ఇంకేదో ఆలోచనలు వచ్చేస్తుంటాయి జనాలకు.

ఇంతకీ అలా ఎవరు చేసారని అనుకుంటున్నారా? ఆవిడ మరెవరో కాదు. నటి మధుశాలిని. దేశంలో ఎన్నికల హడావిడి ఎక్కువ అవడంతో రాజకీయ నాయకులే కాకుండా సినీ పరిశ్రమకు చెందినా వాళ్ళందరూ కూడా ఏదో ఒక రకంగా "ఓటు మన జన్మ హక్కు" అంటూ ప్రచారం చేస్తున్నారు.

అందరూ చేస్తున్నారు నేనెందుకు ఓటు గురించి ప్రచారం చేయకూడదని భావించిన మధుశాలిని కొంచెం కొత్త విధానంతో ప్రచారం చేసింది. ఇంతకీ మధుశాలిని ఏం చేసిందంటే.... ఒక సోఫాలో పడుకొని, చేతిలో ఒక పెన్సిల్ పట్టుకొని, దానిని తన నోట్లో పెట్టుకుంటూ తీస్తూ... ద్వందార్ధాలు వచ్చే విధంగా మాట్లాడుతూ, హాట్ హాట్ గా సెక్సీ‌పోజులో పెన్సిల్ నోట్లో పెట్టుకొని ఫింగర్‌ను కరెక్ట్‌గా యూజ్ చేయండి అంటూ కొంచెం హస్కీ వాయిస్ తో ఏదేదో మాట్లాడేసింది. కానీ అదంతా ఓటు కోసమే అని అనుకోవడం మన పొరపాటు అవుతుంది. కానీ చివర్లో ఒక 5 సెకన్లు సీరియస్ గా "ఓటు వేయడం మన బాధ్యత" అని ముగించింది.

ఈ అమ్మడు చేసిన ఈ సెక్సీ ఓటు ప్రచారం జనాలకు చేరడం అనే మాట పక్కన పెడితే.... ఈ అమ్మడు కానీ ఇదే వీడియోతో జనాల ముందుకు వెళితే చీపురు కట్టలు తిరగేయడం మాత్రం ఖచ్చితం.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.